For Quick Alerts
For Daily Alerts
అమూల్ తర్వాత పాల ధరలు పెంచిన మదర్ డెయిరీ.. లీటర్కు రూ.2 పెంపు
|
మదర్ డెయిరీ పాల ధరలను లీటర్కు రూ.2 పెంచింది. ఇప్పటికే అమూల్ ధరలను పెంచింది. నాలుగు రోజుల క్రితం లీటర్కు రూ.2 పెంచుతూ అమూల్ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మదర్ డెయిరీ ధరలు పెంచింది. మదర్ డెయిరీ పెంచిన ధరలు 25 మే 2019 నుంచి అమలులోకి రానున్నాయి. లీటర్కు రూ.2, అరలీటర్కు రూ.1 పెరగనుంది.
మదర్ డెయిరీ తన టోకెన్ మిల్క్ ధరలను పెంచడం లేదని తెలుస్తోంది. దీనినే బల్క్ వెండర్ మిల్క్ అంటారు. కేవలం పోలీ ప్యాక్ మిల్క్ వేరియంట్స్కు ఇది వర్తిస్తుంది.
అమూల్, మదర్ డెయిరీలు ధరలు పెంచడానికి పలు కారణాలు ఉన్నాయి. మూడు నాలుగు నెలలుగా పెరుగుతున్న ఖర్చుల కారణంగా ఈ ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. దాణా ఖర్చు 15-20 శాతం పెరగడం, లేబర్ కాస్ట్ పెరగడం వంటి కారణాలతో పాల ధరలు పెంచినట్లు మదర్ డెయిరీ ఓ ప్రకటనలో తెలిపింది.
Comments
English summary
అమూల్ తర్వాత పాల ధరలు పెంచిన మదర్ డెయిరీ.. లీటర్కు రూ.2 పెంపు | Mother Dairy raises milk prices up to Rs 2 per litre in Delhi NCR, follows suit after Amul
Story first published: Friday, May 24, 2019, 18:26 [IST]