భారత్లో సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు వచ్చాయి. అయితే ఏ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందనే అంశం సస్పెన్స్గా ఉంది. ఈ ప్రభావం మార్కెట్ల పైన కూడా పడుతోంది. మరోవైపు, అంతర్జాతీయంగా అమెరికా - చైనా ట్రేడ్ వార్ మాటల ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. ఎన్నికల్లో తర్వాత భారత్లో ఏ ప్రభుత్వం వస్తుందనే అంశంపై సస్పెన్స్, అమెరికా - చైనా ట్రేడ్ వార్ నేపథ్యంలో ఓవర్సీస్ ఇన్వెస్టర్స్ భారత్ కేపిటల్ మార్కెట్ నుంచి మే నెలలో రూ.6,399 కోట్లు వెనక్కి తీసుకున్నారట.

ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో పెట్టుబడుల వెల్లువ
దీని కంటే ముందు, ఫారన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (FPI) అంతకుముందు వరుసగా మూడు నెలల పాటు పెట్టుబడులు పెట్టారు. ఏప్రిల్ నెలలో రూ.16,093 కోట్లు, మార్చి నెలలో రూ.45,981 కోట్లు, ఫిబ్రవరి నెలలో రూ.11,182 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. వీరు డొమెస్టిక్ కేపిటల్ మార్కెట్స్ (ఈక్విటీ అండ్ డెబ్ట్)లో పెట్టుబడి పెట్టారు. అయితే మే నెలలో మాత్రం రివర్స్ అయింది.
తాజా డిపాజిట్ డేటా ప్రాకరం ఈక్విటీల నుంచి రూ.4,786 కోట్లకు పైగా, డెబ్ట్ మార్కెట్ నుంచి రూ.1,612 కోట్లకు పైగా FPIలను వెనక్కి తీసుకున్నారు. ఇది కేవలం మే 2వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మాత్రమే. అంటే కేవలం పదహారు రోజుల్లో రూ.6,399 కోట్లను వెనక్కి తీసుకున్నారు.

మార్కెట్పై ఎన్నికల అనిశ్చితి ప్రభావం
సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎవరు గెలుస్తారనే అంచనాకు ఎవరూ రాలేకపోతున్నారు. మళ్లీ ఎన్డీయే ప్రభుత్వమే వస్తుందని, నరేంద్ర మోడీ ప్రధాని అవుతారని ప్రీపోల్ సర్వేలు చెబుతున్నాయి. కానీ సొంతగా మెజార్టీ రాదనే ప్రచార ప్రభావం మార్కెట్ల పైన కూడా పడుతోంది. మోడీ మళ్లీ ప్రధాని అవుతారని, కానీ గతంలో కంటే తక్కువ సీట్లు వస్తాయని, గతంలో అధికారంలోకి రావడానికి కావాల్సిన సీట్లు బీజేపీ గెలుచుకుందని, కానీ ఈసారి కొన్ని సీట్లు తక్కువ పడవచ్చునని భావిస్తున్నారు.

కారణాలెన్నో
సార్వత్రిక ఎన్నికల అనిశ్చితి కారణంగా విస్తృత ఆర్థిక వృద్ధి నెమ్మదించిందని, ఈ నేపథ్యంలో ఫారన్ ఇన్వెస్టర్లు వేచిచూద్దామనే భావనలో ఉన్నారని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ మార్పు ఊహించినది కాదని, దీనికి సార్వత్రిక ఎన్నికలతో పాటు అంతర్జాతీయ పరిణామాలు కూడా కారణమని చెబుతున్నారు. అమెరికా - చైనా ట్రేడ్ వార్ కూడా ఓ కారణమని అంటున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించడం, భారతీయ ఈక్విటీ మార్కెట్లలోకి ద్రవ్యత తగ్గుదల, విస్తృత ఆర్థిక వ్యవస్థ అంతగా లేదని చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications