మైండ్ ట్రీని సొంతం చేసుకోవాలనుకుంటున్న ఎల్ అండ్ టీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఓపెన్ మార్కెట్ ద్వారా మైండ్ ట్రీకి చెందిన 8.86 లక్షలకు పైగా షేర్లను ఇది కొనుగోలు చేసింది. ఒక్కో షేరును రూ.980కు కొనుగోలు చేసినట్టు తెలిపింది. దీంతో మైండ్ ట్రీలో ఎల్ అండ్ టీ వాటా 26.48 శాతానికి పెరిగింది.
బ్లాక్ డీల్ ద్వారా వీజీ సిద్దార్థ, కేఫ్ కాఫీ డేలకు చెందిన దాదాపు 20 శాతం వాటాను ఎల్ అండ్ టీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ డీల్ విలువ రూ.3,210 కోట్లు. అప్పటి నుంచి క్రమంగా ఎల్ అండ్ టీ.. టెక్ దిగ్గజంలో తన వాటాను పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. మైండ్ ట్రీలో 66 శాతం వరకు వాటాను కొనుగోలు చేయాలని చూస్తోంది. ఇందుకు ఓపెన్ ఆఫర్ ప్రకటించింది.

మైండ్ ట్రీని హస్తగతం చేసుకోవాలంటే ఓపెన్ ఆఫర్ ద్వారా మరింత వాటాను కొనుగోలు చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా 31 శాతం వాటాను రూ.950 (ఒక్కో షేరుకు) వద్ద కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబి) అనుమతిని కోరింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications