ఆర్థిక సంక్షోభంతో తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపేసిన జెట్ ఎయిర్వేస్ను షాక్ మీద షాక్ తగులుతోంది. రెండు రోజుల్లో ఇద్దరు టాప్ అధికారులు రాజీనామా చేశారు. ఈ ప్రభావం షేర్లపై భారీగా చూపింది. కంపెనీ సీఈఓ వినయ్ దూబే (సోమవారం), డిప్యూటీ సీఈఓ అమిత్ అగర్వాల్ (మంగళవారం) ఒక్కరోజు వ్యవధిలోనే తమ పదవులకు రాజీనామా చేశారు. ఇది కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావం చూపింది. రెండు రోజులుగా భారీగా నష్టపోతున్న జెట్ షేర్లు బుధవారం కూడా కుప్పకూలాయి.
నేటి ట్రేడింగ్లో జెట్ ఎయిర్వేస్ షేర్లు భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. ఒకానొక దశలో షేరు ధర ఏడు శాతానికి పైగా నష్టంతో ట్రేడ్ అయింది. బీఎస్ఈలో జెట్ షేరు విలువ 5 శాతానికి పైగా నష్టపోయాయి. గడిచిన మూడు సెషన్లలో కంపెనీ షేరు ధర 20శాతానికి పైగా పడిపోయింది.

జెట్ ఎయిర్వేస్ సీఈవో వినయ్ దుబే మంగళవారం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల్లో ఇద్దరు కీలక వ్యక్తులు రాజీనామా చేయడం జెట్ ఎయిర్వేస్కు పెద్ద కుదుపు. డిప్యూటీ సీఈవోగా ఉన్న అమిత్ అగర్వాల్ సోమవారం రిజైన్ చేయగా, వినయ్ దుబే వ్యక్తిగత కారణాలతో మంగళవారం నాడు రాజీనామా చేశారు. రెండు రోజుల్లోనే ఇద్దరు అధికారులు రిజైన్ చేశారు. అమిత్ అగర్వాల్ 2015లో జెట్ ఎయిర్వేస్ సీఎఫ్ఓగా కంపెనీలో చేరాడు.
జెట్ ఎయిర్వేస్ ప్రస్తుతం రుణదాతల చేతిలో ఉంది. ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్టియం జెట్ కోసం బిడ్స్ కూడా ఆహ్వానించింది. ఇటీవలే ఇది ముగిసింది. ప్రస్తుతం ఎక్కువ స్టేక్స్ ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం చేతుల్లో ఉంది. ఎతిహాద్తో పాటు మరికొన్ని సంస్థల నుంచి బిడ్స్ వచ్చాయి. బిడ్స్ సమర్పణకు చివరి తేది గత శుక్రవారం రోజు ముగిసింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications