భారతీయులు వారి పూర్తిస్థాయి శక్తిమేరకు పని చేయడం లేదట. అందుకే చైనా ఉత్పత్తులను భారత్లో నిషేధించినా.. ఎక్కువ కాలం దాని ప్రభావం ఉండదని ఒక చైనా పత్రిక విశ్లేషించింది. చైనాకు ధీటుగా ఎదగాలంటే భారతీయులు తప్పనిసరిగా 996 (9AM to 9 AM) ఆరు రోజులు పని చేయాలట. ఈ 996 పనివేళలను చైనా దేశపు అత్యంత ధనికుడు, అలీబాబా సంస్థ అదినేత జాక్ మా ప్రతిపాదించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రతిపాదనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయినప్పటికీ భారత్లో తయారీ రంగం పుంజుకోవాలన్నా ఈ రంగంలోకి భారీగా విదేశీ పెట్టుబడులు తరలి రావాలన్నా.. మన పరిశ్రమల్లో రోజుకు 12 గంటలు.. వారానికి ఆరు రోజులు (996) కార్మికులు శ్రమించాలనేది చైనా పత్రిక సూచన అని దానిని ఉటంకిస్తూ ది ఎకనమిక్ టైమ్స్ పేర్కొంది.

అలా కష్టపడకపోతే, సమీప భవిష్యత్తులో భారత్లో చైనాకు ఎలాంటి ముప్పు వాటిల్లదని సారాంశం. ఎలాగూ చైనీయులు అధిక పని గంటలు శ్రమిస్తూ దేశాన్ని ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దడంలో సఫలీకృతులయ్యారని, నాణ్యమైన, అధిక ఫీచర్లున్న ఉత్పత్తులను చవక ధరలకే అందించే సత్తా కేవలం చైనాకే ఉందని పేర్కొంది.
భారత్లో కొన్ని గ్రూప్లు జాతీయ భావం పేరుతో చైనా ఉత్పత్తులను నిషేధించాలని కోరుకుంటున్నా.. అది దీర్ఘకాలంలో సాధ్యం కాదని అంచనా వేసింది. నిజంగా ఉత్పత్తులను బహిష్కరిస్తే అది కేవలం స్వల్పకాలికానికే పరిమితం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేసింది.
చైనాను సమర్థంగా ఎదుర్కోవాలంటే, ముఖ్యంగా పారిశ్రామిక, తయారీ రంగంలో భారత్ అధిక పని గంటల సంస్కృతిని అలవాటు చేసుకోవాల్సిందేనని ఉవాచ పలికింది. ఈ మేరకు భారీయులు వారి పూర్తి సామర్థ్యం మేరకు కష్టపడి పని చేస్తే కొంత మార్పు సాధ్యమేనని సూచించింది. భారత్లో రోజుకు 8 గంటలు పని వేళలు అమలులో ఉన్న సంగతి తెలిసిందే. దీనిని 12 గంటలకు పెంచడం రాజకీయంగా సాధ్యం కాకపోవచ్చు.
More From GoodReturns

Gold price Today: భగభగమంటున్న పసిడి.. హైదరాబాద్లో ధర ఎంతంటే?

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications