భారతీయులు వారి పూర్తిస్థాయి శక్తిమేరకు పని చేయడం లేదట. అందుకే చైనా ఉత్పత్తులను భారత్లో నిషేధించినా.. ఎక్కువ కాలం దాని ప్రభావం ఉండదని ఒక చైనా పత్రిక విశ్లేషించింది. చైనాకు ధీటుగా ఎదగాలంటే భారతీయులు తప్పనిసరిగా 996 (9AM to 9 AM) ఆరు రోజులు పని చేయాలట. ఈ 996 పనివేళలను చైనా దేశపు అత్యంత ధనికుడు, అలీబాబా సంస్థ అదినేత జాక్ మా ప్రతిపాదించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రతిపాదనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయినప్పటికీ భారత్లో తయారీ రంగం పుంజుకోవాలన్నా ఈ రంగంలోకి భారీగా విదేశీ పెట్టుబడులు తరలి రావాలన్నా.. మన పరిశ్రమల్లో రోజుకు 12 గంటలు.. వారానికి ఆరు రోజులు (996) కార్మికులు శ్రమించాలనేది చైనా పత్రిక సూచన అని దానిని ఉటంకిస్తూ ది ఎకనమిక్ టైమ్స్ పేర్కొంది.

అలా కష్టపడకపోతే, సమీప భవిష్యత్తులో భారత్లో చైనాకు ఎలాంటి ముప్పు వాటిల్లదని సారాంశం. ఎలాగూ చైనీయులు అధిక పని గంటలు శ్రమిస్తూ దేశాన్ని ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దడంలో సఫలీకృతులయ్యారని, నాణ్యమైన, అధిక ఫీచర్లున్న ఉత్పత్తులను చవక ధరలకే అందించే సత్తా కేవలం చైనాకే ఉందని పేర్కొంది.
భారత్లో కొన్ని గ్రూప్లు జాతీయ భావం పేరుతో చైనా ఉత్పత్తులను నిషేధించాలని కోరుకుంటున్నా.. అది దీర్ఘకాలంలో సాధ్యం కాదని అంచనా వేసింది. నిజంగా ఉత్పత్తులను బహిష్కరిస్తే అది కేవలం స్వల్పకాలికానికే పరిమితం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేసింది.
చైనాను సమర్థంగా ఎదుర్కోవాలంటే, ముఖ్యంగా పారిశ్రామిక, తయారీ రంగంలో భారత్ అధిక పని గంటల సంస్కృతిని అలవాటు చేసుకోవాల్సిందేనని ఉవాచ పలికింది. ఈ మేరకు భారీయులు వారి పూర్తి సామర్థ్యం మేరకు కష్టపడి పని చేస్తే కొంత మార్పు సాధ్యమేనని సూచించింది. భారత్లో రోజుకు 8 గంటలు పని వేళలు అమలులో ఉన్న సంగతి తెలిసిందే. దీనిని 12 గంటలకు పెంచడం రాజకీయంగా సాధ్యం కాకపోవచ్చు.
More From GoodReturns

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

పశ్చిమాసియాలో యుద్ధం.. చమురు ధరల్లో భారీ పెరుగుదల.. ఎంతలా ఎగబాకాయంటే..

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications