ధోనీ ఐపీఎల్ శాలరీ ఎంతో తెలుసా, మొత్తం ఆస్తులు ఎంతంటే?
మహేంద్ర సింగ్ ధోనీ.. క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కరలేని పేరు. ఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్లో చెన్నై గెలుస్తుందని చాలామంది భావించారు. అందుకు ఒకే ఒక కారణం.. ధోనీ. ఉత్కంఠబరితంగా సాగిన ఫైనల్లో ఒక్క పరుగు తేడాతో చెన్నై ఓడిపోయింది. గెలుపును, ఓటమిని ఒకే రకంగా తీసుకునే అతికొద్దిమంది క్రికెటర్లలో ధోనీ ముందుంటాడు. ఐపీఎల్లో చాలామంది చెన్నై ఫ్యాన్స్ ఉంటారు. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్కతా వాసులు.. తమ జట్టు లేదా చెన్నై జట్టు గెలవాలని కోరుకుంటారు. అందుకు కారణం ధోనీ. అలాంటి ధోనీ ఐపీఎల్ రెమ్యునరేషన్ గురించి కొన్ని విషయాలు...
ఫ్లిప్కార్ట్ బంపర్ బొనాంజా, ఉద్యోగులకు 100 మిలియన్ డాలర్లు
టాప్ సెకండ్ ధోనీ
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అతనిని రూ.15 కోట్లకు కొనుగోలు చేసింది. విరాట్ కోహ్లీని రూ.17 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. ధోనీతో పాటు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, ఢిల్లీ కేపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్లను కూడా ఆయా జట్లు రూ.15 కోట్లకు కొనుగోలు చేశాయి.
ధోనీ ఆస్తులు
ఎంఎస్ ధోనీ ఆస్తులు రూ.830 కోట్ల వరకు ఉంటాయని అంచనా. అంటే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ తర్వాత ధనవంతుడైన క్రికెటర్లలో రెండోవాడు. టాప్ టెన్ ధనవంతులైన క్రికెటర్ల జాబితాలో సచిన్, ధోనీ, విరాట్ కోహ్లీ, రికీ పాంటింగ్, షేన్ వార్నర్, సెహ్వాగ్, యువరాజ్ సింగ్, షేన్ వాట్సన్లు ఉంటారు.
కోట్లు ఆర్జిస్తున్న ధోనీ
బీసీసీఐతో కాంట్రాక్టు ద్వారా ధోనీ ఏడాదికి రూ.5 కోట్లు పొందుతున్నాడు. వీటితో పాటు పలు ప్రకటనల్లో కనిపిస్తూ కోట్లు ఆర్జిస్తున్నాడు. ఎయిర్సెల్, పెప్సీ, సొనాటా, టీవీఎస్ మోటార్స్ వంటి వాటికి ప్రచారకర్తగా ఉన్నాడు.