పడిపోతున్న మారుతి సుజుకీ షేర్లు, కారణమిదే!
మారుతి సుజుకీ షేర్లు ఇంట్రా డేలో శుక్రవారం నాడు ఒక్కరోజే 2 శాతం పడిపోయాయి. వరుసగా ఆరో రోజు షేర్లు నష్టపోయాయి. మారుతి సుజుకీ క్వార్టర్ 4 లాభాలు ఐదు శాతం పడిపోయాయి. గత వారం ఆరు రోజుల్లో షేర్లు ఏకంగా 10 శాతం పడిపోయాయి. నేడు కూడా షేర్లు నష్టాల్లో కొనసాగాయి.
ఖర్చు తగ్గించి, లాభాలు పెంచే ప్రణాళికలో మారుతి సుజుకీ
మారుతి సుజుకీ ఇండియా షేర్లు ఇంట్రాడేలో 2.23 శాతం తగ్గి, రూ.6,749కి పడిపోయాయి. గత క్లోజింగ్ 6,902.95గా ఉంది. కానీ మంగళవారం కూడా బాగా పడిపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్తో పాటు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా షేర్లు నష్టపోయాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో గత ముగింపు రూ.6,905.25 అయితే నేడు 6,805తో ప్రారంభమైంది.
4.6 శాతం లాభం తగ్గినట్లు గత గురువారం మారుతీ సుజుకీ ప్రకటించింది. సేల్స్ 0.7 శాతం (రూ.20,738 కోట్లు) పెరిగాయి. లాభాలపై మార్చి క్వార్టర్ ప్రభావం పడినట్లుగా తెలిపింది. ప్రతికూల ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్లు, కమోడిటీ ధరలు, హయ్యర్ సేల్స్ ప్రమోషన్ ఖర్చులు వంటివి కారణాలుగా పేర్కొంది. 2019 ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ 2.91 శాతం క్షీణత ప్రకటించింది.