ప్రముఖ ఫోర్ వీలర్ తయారీ సంస్థ మారుతి సుజుకి సంచలన నిర్ణయం తీసుకుంది. ఏడాదిలో డీజిల్ కార్ల ఉత్పత్తిని మొత్తం నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. అవును మీరు చదివింది నిజమే.
మీరు మారుతి సుజుకి చెందిన స్విఫ్ట్, డిజైర్, సియాజ్, ఎస్ క్రాస్, ఇగ్నిస్ డీజిల్ కార్లను కొనాలని అనుకుంటున్నారా.. అయితే వెంటనే కొనేయండి. ఎందుకంటే ఏప్రిల్ 1, 2020 నుంచి మారుతి సంస్థ ఈ కార్లకు చెందిన డీజిల్ మోడల్స్ అన్నింటినీ పూర్తిగా నిలిపేయబోతోంది. 1.5 లీటర్ల కంటే తక్కువ ఇంజిన్ సామర్ధ్యం కలిగిన డీజిల్ ఇంజన్లన్నింటినీ దశలవారీగా ప్రొడక్షన్ అపేయబోతున్నట్టు మారుతి సుజుకి అధికారికంగా ప్రకటించింది.
ఎందుకంటే..
ఏప్రిల్ 1 2020 నుంచి భారత్ ఎమిషన్ స్టేజ్ 6 నిబంధనలను ఆటోమొబైల్ కంపెనీలన్నీ పాటించాల్సి ఉంటుంది. వాటికి అనుగుణంగా కార్లను తయారు చేయాలంటే తడిసి మోపెడవుతుందని, ఇవి ఏ మాత్రం కాస్ట్ వర్కవుట్ కాదని మారుతి సుజుకి ఛైర్మన్ ఆర్. సి. భార్గవ వెల్లడించారు. ఇప్పుడు పెట్రోల్ - డీజిల్ కార్ల మధ్య వ్యత్యాసం రూ.1 లక్ష వరకూ ఉంది. కానీ ఈ నిబంధనల అనుగుణంగా కార్లను ఉత్పత్తి చేయాలంటే కనీసం రూ.2.5 లక్షల వరకు పెట్రోల్- డీజిల్ మధ్య తేడా పెరుగుతుంది.

'' చిన్న డీజిల్ ఇంజన్లను బీఎస్-6కి అనుగుణంగా మార్చడం చాలా కఠినమైన వ్యవహారం. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పనికూడా. అంత ధర పెట్టి డీజిల్ కార్లను కొనుగోలు చేయడం వల్ల వచ్చే ప్రయోజనం కూడా పెద్దగా ఉండకపోవచ్చు. అందుకే దశల వారీగా డీజిల్ కార్లను తగ్గించేస్తాం'' - మారుతి సుజుకి ఛైర్మన్ ఆర్. సి. భార్గవ.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మారుతి మొత్తం వాహన అమ్మకాల్లో డీజిల్ కార్ల వాటా 25 శాతం ఉంది. దీంతో ఈ అమ్మకాలపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే స్టాక్ మార్కెట్లో మారుతి సుజుకి స్టాక్ కూడా గత నాలుగైదు రోజులుగా భారీగా పతనమవుతూ వస్తోంది.
మరి డీజిల్ ఉండవా
మెల్లిగా వివిధ కంపెనీలు కూడా ఇదే బాట పట్టక తప్పని స్థితి. పెట్రోల్తో పోలిస్తే డీజిల్ అత్యధిక కాలుష్యాన్ని వెదజల్లుతుందని గతంలో సుప్రీం కోర్టు కూడా వ్యాఖ్యానించింది. ప్రపంచ వ్యాప్తంగా డీజిల్ కార్ల ఉత్పత్తి, వాడకం అంతంతే. అందుకే మెల్లిగా సీఎన్జీ, ఎలక్ట్రిక్ వైపు కంపెనీలు మళ్లుతున్నాయి. రాబోయే రోజుల్లో పెట్రోల్ కంటే ఎలక్ట్రిక్, సీఎన్జీ వాహనాలే రోడ్లపై అధికంగా కనపడవచ్చు. కాలుష్యాన్ని తగ్గించేందుకు, చమురుపై ఆధారపడడం తగ్గించుకునేందుకు ప్రపంచ దేశాలన్నీ ఈ బాట పడ్తున్నాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications