200% రిటర్న్స్, బంపరాఫర్: ఈ కంపెనీలో ఐదేళ్ల క్రితం ఇన్వెస్ట్ చేస్తే మూడింతలు అయ్యేది
భారతీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో దూసుకెళ్తోంది. గత అయిదేళ్లలో అమెరికా డౌజోన్స్, జపాన్ నికాయ్ మార్కెట్లతో పోల్చుకుంటే ఇండియన్ ఈక్విటీ మార్కెట్లు మంచి రికార్డ్స్ నమోదు చేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 73 శాతం ర్యాలీ నమోదు చేయగా, డౌజోన్స్ 62 సాతం, నికాయ్ 54 శాతం మాత్రమే నమోదు చేశాయి. ఈ అయిదేళ్ల కాలంలో ఒక బ్లూచిఫ్ ఎఫ్ఎంసీజీ స్టాక్ 200 శాతం పరుగులు పెట్టింది. ఇన్వెస్టర్ల సొమ్ము మూడింతలు అయంది. ఇది బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్లో ఎప్పటి నుంచో ఉంటోంది. ఆ ఎఫ్ఎంసీజీ కంపెనీయే హిందూస్తాన్ యూనివర్ లిమిటెడ్ (హెచ్యూఎల్).
ఈ అయిదేళ్ల కాలంలో ఈ స్టాక్ ఏకంగా 200 శాతం లాభాలను అందించింది. సెన్సెక్స్ 73 శాతం పెరిగింది. 2014 ఏప్రిల్ 25వ తేదీన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో రూ.580.90 ఉన్న షేరు ఇప్పుడు ధర రూ.1,758.90 వద్ద ఉంది. అంటే ఈ అయిదేళ్లలో 202 శాతం పెరిగింది. అంటే అయిదేళ్ల క్రితం మీరు ఇది కొనుగోలు చేస్తే ఇప్పుడు మీకు రెండింతలు లాభం వచ్చి ఉండేది.
రూ.300 ఇన్వెస్ట్తో కోటీశ్వరులు కావొచ్చు!
ప్రస్తుతం ఎన్ఎస్ఈలో నాలుగో అతిపెద్ద పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ హిందుస్తాన్ యూనివర్ లిమిటెండ్. ఎఫ్ఎంసీజీ విభాగంలో ఇదే అతిపెద్ద సంస్థ. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3.76 లక్షల కోట్లు. కంపెనీ వచ్చే నెలలో క్యూ4 ఆర్థిక ఫలితాలు ప్రకటించనుంది.
హెచ్యూఎల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3.79 లక్షల కోట్లు. ఐటీసీ లిమిటెండ్ క్యాపిటలైజేషన్ రూ.3.76 లక్షల కోట్లు. హెచ్యూఎల్ 2018 ఆర్థిక సంవత్సరంలో 5,237 కోట్ల ప్రాఫిట్ ప్రకటించింది.