రిలయన్స్ జియో, ప్రభుత్వరంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఫిబ్రవరి నెలలో సత్తా చాటాయి. మిగిలిన టెలికం రంగ సంస్థల కంటే ఇవి ఎక్కువ మంది సబ్స్క్రైబర్లకు చేరుకున్నాయి. ఫిబ్రవరి చివరినాటికి దేశంలో టెలికం వినియోగదారుల సంఖ్య 120.50 కోట్లకు చేరుకుందని ట్రాయ్ గురువారం తెలిపింది. క్రితం ఫిబ్రవరి నెలలో కొత్తగా వినియోగదారులను ఆకర్షించిన వాటిలో రిలయన్స్ జియో, బిఎస్ఎన్ఎల్ టాప్లో నిలిచాయి. జియో, బిఎస్ఎన్ఎల్లు 86.39 లక్షల మంది వినియోగదారులను పొందాయి. ఇదే ఫిబ్రవరి నెలలో ఇతర టెలికం ఆపరేటర్లు 69.93 లక్షల మందిని కోల్పోయారు.

జియో, బీఎస్ఎన్ఎల్ హవా
ఒక్క జియోనే ఫిబ్రవరిలో 77.93 లక్షల మంది వినియోగదారులను జోడించింది. దీంతో తక్కువ సమయంలో ఏకంగా 30 కోట్ల సబ్స్క్రైబర్లు కలిగిన రికార్డ్ సొంతం చేసుకుంది. బీఎస్ఎన్ఎల్ 9 లక్షల మందిని జోడించింది. దీంతో బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య 11.62 కోట్లకు చేరుకుంది. ఇక, ఫిక్స్డ్ లైన్ కనెక్షన్స్ సంఖ్య దేశంలో క్రమంగా తగ్గుతోంది. ఫిబ్రవరిలో బీఎస్ఎన్ఎల్ లక్షమందిని కోల్పోగా, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు వరుసగా 42,456, 17,563 ఫిక్స్డ్ లైన్ కస్టమర్లను పొందారు.

కస్టమర్లను కోల్పోయిన వొడాఫోన్ ఐడియా
ఇక, అత్యధికంగా వినియోగదారులను కోల్పోయిన జాబితాలో వొడాఫోన్ ఐడియా ఉన్నట్లు తేలింది. ఇది ఏకంగా 57.87 లక్షల సబ్స్క్రైబర్లను కోల్పోయింది. ఫిబ్రవరి చివరి నాటికి వొడాఫోన్ - ఐడియా వినియోగదారుల సంఖ్య 40.93 కోట్లకు తగ్గినట్లు ట్రాయ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. టాటా టెలీ సర్వీసెస్ 11.47 లక్షల మంది మొబైల్ కస్టమర్లను కోల్పోగా, ఎయిర్టెల్ 49,896 మందిని కోల్పోయింది.

జియో మినహా బీఎస్ఎన్ఎల్ మాత్రమే
రిలయన్స్ జియో మినహా బీఎస్ఎన్ఎల్ మాత్రమే అదనపు ఖాతాదారులను పొందిందని బీఎస్ఎన్ఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. తమ సంస్థ పట్ల వినియోగదారులకు ఉన్న ఆసక్తిని ఇది ప్రతిబింబిస్తుందని చెప్పారు. తమ 3జీ నెట్వర్క్ను మరింత మెరుగుపర్చుకోవడం, అధికారులు, ఉద్యోగుల సంయుక్త సహకారంతో మరింత రాణిస్తామన్నారు. మా సేవల పట్ల కస్టమర్లకు ఉన్న విశ్వాసం వల్లనే బేస్ పెరిగిందని తెలిపారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications