లండన్: బ్యాంకులకు వేలకోట్లు కుచ్చుటోపీ పెట్టి లండన్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేశాడు. బ్యాంకులను నమ్మాలా, ప్రధానిని నమ్మాలా అని ప్రశ్నించాడు. మోడీ ప్రభుత్వం వచ్చాక మాల్యా, నీరవ్ మోడీ వంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించేందుకు చట్టం తీసుకువచ్చారు. దీంతో మాల్యా దిగివచ్చి తన అప్పులు చెల్లిస్తానని చెబుతున్నాడు. లండన్లో ఉంటున్న అతను అప్పుడప్పుడు ట్వీట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు.
తాను చెల్లించే అప్పుల విషయంలో ప్రధాని మోడీ అబద్ధాలు చెబుతున్నారా లేక బ్యాంకులు చెబుతున్నాయా తనకు అర్థం కావడం లేదని మాల్యా అన్నాడు. బ్యాంకులకు తాను చెల్లించాల్సిన రుణాల కంటే ఎక్కువగానే ప్రభుత్వం రికవరీ చేసుకుందని స్వయంగా భారత ప్రధాని మోడీయే ఓ ఇంటర్వ్యూలో చెప్పారని, కానీ కొన్ని బ్యాంకులు బ్రిటన్ కోర్టుల్లో ఇందుకు పూర్తి విరుద్ధంగా చెబుతున్నాయని, ఎవరిని నమ్మాలని ప్రశ్నించాడు. మోడీ లేదా బ్యాంకులు ఎవరో ఒకరు అబద్ధం చెప్పి ఉండాలని ట్వీట్ చేశాడు.

పలు బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యా 2016లో భారత్ విడిచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి లండన్లో ఉంటున్నాడు. అతడిని భారత్కు అప్పగించే విషయమై లండన్ కోర్టులో విచారణ సాగుతోంది.
మరోవైపు, రుణాలు చెల్లించే విషయంలో సెటిల్మెంట్కు రావాలని విజయ్ మాల్యా బ్యాంకులను కోరాడు. ఇందుకు బ్యాంకులు ఒప్పుకోకపోవడంతో విమర్శలు చేస్తున్నాడు. అయితే ప్రభుత్వం ఇలాంటి వారి పట్ల కఠిన చట్టం తీసుకు రావడంతో ఆయన మెట్టు దిగాడు. దీంతో పారిపోయిన అతని పట్ల చట్టపరంగా ముందుకు వెళ్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications