ఒక్కో షేర్ను రూ.325కి కొంటాం - విప్రో బంపర్ ఆఫర్
విప్రో రెండేళ్లలో వరుసగా మూడోసారి కూడా షేర్ల బైబ్యాక్ ప్రకటించింది. ఈ సారి భారీ ఎత్తున సుమారు రూ.10500 కోట్లను ఇందుకోసం కేటాయించింది. ఈ ప్రతిపాదనకు విప్రో బోర్డ్ ఆమోదం తెలిపింది. సుమారు 32.31 కోట్ల షేర్లను ఒక్కోటి రూ.325 చొప్పున తిరిగి కొనేందుకు విప్రో సిద్ధమైంది. ప్రస్తుతం మార్కెట్లో విప్రో షేర్ ధర రూ.281 మాత్రమే ఉంది. రికార్డ్ తేదీని సంస్థ ఇంకా ప్రకటించలేదు. దీనిపై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
ఎందుకీ బైబ్యాక్
విప్రో సంస్థ దగ్గర పటిష్టమైన క్యాష్ ఫ్లోస్ ఉన్నాయని, స్థిరమైన ఆదాయానికి తోడు మార్జిన్లు కూడా పెరుగుతున్నాయని యాజమాన్యం ప్రకటించింది. షేర్ హోల్డర్లకు ప్రయోజనం చేకూర్చడం తమ సంస్థ లక్ష్యమని, అందుకే బైబ్యాక్ ప్రతిపాదన చేసినట్టు సంస్థ సీఎఫ్ఓ జతిన్ దలాల్ వెల్లడించారు.
SBI ATM Card Rules: క్యాష్ విత్ డ్రా లిమిట్, ట్రాన్సాక్షన్
ఏంటి ప్రయోజనం
ప్రస్తుతం
మార్కెట్
ధర
కంటే
సుమారు
15
శాతం
ధర
ఎక్కువ
పెట్టి
మరీ
షేర్లు
కొనేందుకు
సిద్ధమైంది
అంటే
దాని
అర్థం
కంపెనీపై
ఇన్వెస్టర్లలో
నమ్మకం
పెంచడానికే
అని
అర్థం
చేసుకోవాలి.
వరుసగా
రెండేళ్లలో
మూడోసారి
విప్రో
ఇలాంటి
బైబ్యాక్
నిర్ణయాన్ని
తీసుకుంది.
సంస్థ
దగ్గర
మూలుగుతున్న
నగదు
నిల్వలను
తగ్గించుకునేందుకు,
షేర్
హోల్డర్లకు
ప్రయోజనం
చేకూర్చేందుకు
సంస్థలు
ఇలాంటి
బైబ్యాక్
ప్రకటనలు
చేస్తాయి.
అయితే
మార్కెట్లో
సుమారు
227
కోట్ల
షేర్ల
వరకూ
ఉన్నాయి.
మొత్తం
షేర్
క్యాపిటల్
905
కోట్ల
షేర్లు
అయితే
అందులో
ప్రమోటర్ల
వాటా
సుమారు
75
శాతం
దాకా
ఉంది.
మిగిలిన
రిటైల్
పోర్షన్
చూస్తేనే
227
కోట్ల
షేర్లు
వస్తాయి.
ఇందులో
32
కోట్ల
షేర్లను
సంస్థ
తిరిగి
కొనాలని
చూస్తోంది.
అంటే
మన
దగ్గర
పది
షేర్లు
ఉండి
మనం
కూడా
ఈ
బైబ్యాక్లో
పాల్గొంటే
ఒక్క
షేర్
మాత్రమే
రూ.325కు
అమ్ముడయ్యే
అవకాశం
ఉంటుందనే
విషయాన్ని
ఇన్వెస్టర్లు
అర్థం
చేసుకోవాల్సి
ఉంటుంది.