ATM ఫ్రాడ్-ఫేక్ ట్రాన్సాక్షన్: మూడ్రోజుల్లో 61 ఖాతాల్లో నుంచి రూ.15 లక్షలు గల్లంతు
టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతుందో ఫ్రాడ్ చేసేవాళ్లు కూడా అలాగే పెరుగుతున్నారు. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఏటీఎం ప్రాడ్ కలకలం రేపుతోంది. ఏటీఎం మోసం ద్వారా పీఎన్బీలోని 61 ఖాతాల్లో నుంచి ఏకంగా రూ.15 లక్షలు గల్లంతయ్యాయి. ఇప్పటికే బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద స్కాంలో చిక్కుకున్న పీఎన్బీలో తాజాగా అక్రమ లావాదేవీల ఉదంతం వెలుగు చూడటం ప్రకంపనలు రేపుతోంది. ఇది ఆలస్యంగా వెలుగుచూసింది.
ఈ విషయాన్ని పీఎన్బీ బ్యాంక్ అధికారులు స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేవలం 3 రోజుల వ్యవధిలో 61 మంది అకౌంట్స్ నుంచి దాదాపు రూ.15 లక్షల గల్లంతయ్యాయి. ఏటీఎం మోసాలపై బ్యాంకులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంటాయి. బ్యాంకులు తగిన సూచనలు జారీ చేస్తున్నప్పటికీ ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్, ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్స్ (ఏటీఎం) లకు సంబంధించిన నేరాలు పెరుగుతున్నాయి.
SBI బ్యాంక్కు వెళ్లకుండా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు: ఇలా... స్టెప్ బై స్టెప్
ఏప్రిల్ 8వ తేదీ నుంచి తన ఖాతానుంచి తన ప్రమేయం లేకుండానే గుర్తు తెలియని లావాదేవీ జరిగిందని ఒక అకౌంట్ హోల్డర్ పీఎన్బీ వసంత్ విహార్ బ్రాంచ్ మేనేజర్కు ఫిర్యాదు చేశాడు. దీంతో బ్యాంక్ అధికారులు అప్రమత్తమై, ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఫిర్యాదుదారుల జాబితా పెరిగింది. బ్యాంక్ ప్రకటన ప్రకారం మొత్తం రూ.14,97,769 సొమ్ము గల్లంతయింది. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు వసంత్ విహార్ డీసీపీ(సౌత్ వెస్ట్) దేవేందర్ ఆర్యా తెలిపారు.