ట్విస్ట్: టెక్నాలజీ వల్ల 4.5 కోట్ల ఉద్యోగాలు పోతాయి, 6.5 కోట్ల ఉద్యోగాలు వస్తాయి
పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా రానున్న ఆరేళ్లలో 4.5 ఉద్యోగాలు ఊడిపోనున్నాయని మెకిన్సే గ్లోబల్ ఇనిస్టిట్యూట్ రిపోర్ట్ విడుదల చేసింది. అదే సమయంలో 6 కోట్ల కొత్త ఉద్యోగాలు పుట్టుకు వస్తాయని చెప్పింది. డిజిటల్ టెక్నాలజీల ప్రభావంతో కోల్పోయే ఉద్యోగాల కంటే కొత్తగా పుట్టుకు వచ్చేవే అధికమని ఈ రిపోర్టు పేర్కొంది.
గుడ్ న్యూస్: పాన్-ఆధార్ కార్డ్ లింక్ గడువు 6 నెలలు పొడిగింపు
కొత్త టెక్నాలజీ కారణంగా 2025నాటికి ప్రపంచంలో నాలుగున్నర కోట్ల వరకు ఉద్యోగాలు స్థానభ్రంశం లేదా రూపాంతరం చెందనున్నాయని ఈ రిపోర్ట్ తెలిపింది. టెక్నాలజీ వల్ల ఇదే కాలానికి 6.5 కోట్ల కొత్త కొలువులు సృష్టించేందుకు దోహదపడనున్నాయని అంచనా వేసింది. ఉద్యోగాలు సమూల మార్పులకు లోనవుతున్న నేపథ్యంలో 1-4.5 కోట్ల మంది సిబ్బందికి భవిష్యత్ టెక్నాలజీల్లో శిక్షణ ఇచ్చి, కొత్త విధులు అప్పగించడం ఎంతో అవసరమని ఈ రిపోర్టు పేర్కొంది.
వచ్చే ఆరేళ్లలో అంటే 2025 నాటికి స్థూల దేశీయోత్పత్తిలో ఐటీ, సాఫ్టువేర్, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ (బీపీఎం), డిజిటల్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ వంటి కీలక డిజిటల్ రంగాల వాటా రెట్టింపు స్థాయి 435 బిలియన్ డాలర్లకు పెరగనుందని ఈ రిపోర్టు పేర్కొంది.
ముఖ్యంగా, ఇండియన్ టెక్కీల సామర్థ్యంపై దిగ్గజ ఐటీ కంపెనీల కోసం ఈ రిపోర్టు తయారు చేసినట్లు తెలిపింది. తద్వారా ఉద్యోగులు తమ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఈ అధ్యయనం తోడ్పడనుందని పేర్కొంది. ఉద్యోగులు తమ నైపుణ్యాన్ని ఎప్పటికి అప్పుడు అప్ డేట్ చేసుకోవాలని, లేదంటే ఉద్యోగాలు డేంజర్ జోన్లో పడినట్లేనని ఈ రిపోర్ట్ చెబుతోంది. ఇదిలా ఉండగా, గ్లోబల్ స్థాయిలో జీడీపీలో ఐటీ సాఫ్టువేర్ ఎగుమతుల విలువ 2025 నాటికి రూ.30 లక్షల కోట్లకు చేరనుందని ఆశాభావం వ్యక్తం చేసింది.