బ్రస్సెల్స్: సెర్చింజన్ గూగుల్ పైన యూరోపియన్ యూనియన్ (ఈయూ) రెగ్యులేటర్లు భారీ జరిమానా విధించారు. దాదాపు 1.50 బిలియన్ యూరోల (దాదాపు11,623 కోట్లు) పెనాల్టీని విధించారు. నిబంధనలకు విరుద్ధంగా ఓ సంస్థకు ప్రకటనల రూపంలో మేలు చేసినందుకు గాను యూరోపియన్ యూనియన్ కాంపిటీషన్ కమిషన్ ఈ జరిమానాను విధించింది.
ఆన్లైన్ ప్రకటనల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్నందుకే ఈ జరిమానా విధించినట్లు తెలిపింది. గూగుల్ తన విధుల్ని మరిచిపోయిందని పేర్కొంది. ఈ మేరకు యూరోపియన్ యూనియన్ కాంపిటిషన్ కమిషనర్ మార్గరెట్ వెస్టగర్ బుధవారం ఆదేశాలు జారీచేశారు.
ఈ మేరకు మార్గారెట్ వెస్టాగర్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రకటనల్లో గూగుల్ గుత్తాధిపత్యం ఆరోపణల నేపథ్యంలో.. సుదీర్ఘ విచారణ తర్వాతే ఈ జరిమానా విధించినట్లు చెప్పారు. గూగుల్ తన అధికారాన్ని గూగుల్ దుర్వినియోగం చేస్తోందని, దాని వల్ల కొన్ని కంపెనీలు లాభాలు గడిస్తున్నాయని, వినియోగదారులు మోసపోతున్నారన్నారు. గత రెండేళ్లలో ఇంత పెద్ద మొత్తంలో పెనాల్టీ విధించడం ఇది మూడవసారి అన్నారు.

గూగుల్పై ఇలా జరిమానాల వేయడం మూడోసారి. బ్రోకర్ల ద్వారా వెబ్సైట్లను అడ్డుకుంటూ గూగుల్ ప్రకటనల ప్రపంచాన్ని ఏలాలని ప్రయత్నాలు చేసిందన్నారు. గూగుల్, దాని మాతృ సంస్థ అల్భాబెట్.. ఈయూ యాంట్రీ ట్రస్ట్ నియమాలను ఉల్లంఘించాలని పేర్కొన్నారు.
గూగుల్ తమ యాడ్ సెన్స్ వేదికను దుర్వినియోగం చేస్తూ ఇతర పోటీ సంస్థలకు అవకాశం లేకుండా కుట్రతో వ్యవహరించిందన్నారు. దీనివల్ల వినియోగదారులపై భారం పడుతోందని, ఇతర సంస్థల ప్రకటనల వ్యయం పెరుగుతోందని, కొన్ని సంస్థలకే లాభాలు వచ్చేలా గూగుల్ ప్రవర్తించిందన్నారు. కాగా, మైక్రోసాఫ్ట్ ఫిర్యాదు నేపథ్యంలో 2016లో విచారణ ప్రారంభించిన ఈయూ.. తాజాగా ఈ జరిమానా విధించింది. గతంలోనూ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం కేసులో 5 బిలియన్ డాలర్లు, మరో కేసులో 3 బిలియన్ డాలర్ల మేర జరిమానాల్ని గూగుల్పై ఈయూ విధించింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications