న్యూఢిల్లీ: ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. మరో పది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొన్ని అంశాలను గుర్తుకు ఉంచుకోవాల్సి ఉంది. ఆదాయపన్ను రిటర్న్స్ కోసం ఆధార్, పాన్ లింకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగం మారితే ఈపీఎఫ్ను కూడా సులభతరం చేసింది. ఏప్రిల్ 1వ తేదీలోపు మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని అంశాలు...

ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలుకు
పన్ను చెల్లింపుదారులు ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేయాలంటే తమ ఆధార్, పాన్కార్డులను తప్పనిసరిగా అనుసంధానం చేయాల్సిందేనని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) స్పష్టం చేసింది. మార్చి 31వ తేదీలోగా ఈ అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసుకోవాలని పేర్కొంది. ఆధార్, పాన్కార్డ్ అనుసంధానం తప్పనిసరి అని సుప్రీం కోర్టు కూడా చెప్పింది. ఆదాయపన్ను చట్టం 1961లోని సెక్షన్ 139ఏఏ ప్రకారం ఆధాయపన్ను రిటర్నులకు ఆధార్, పాన్ అనుసంధానం తప్పనిసరి అని ఫిబ్రవరి 6వ తేదీన తీర్పు ఇచ్చింది. మార్చి 31, 2019లోపు దీనిని లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లోపు మీ ఆధార్, పాన్ కార్డ్ అనుసంధానం చేసుకోకపోతే మీ పాన్ కార్డ్ పని చేయదు. అయితే బ్యాంక్ ఖాతాలకు, మొబైల్ ఫోన్లకు, పాఠశాల దరఖాస్తులకు ఆధార్ అవసరం లేదని తెలిపింది. కేంద్రం జారీ చేసిన పాన్ కార్డుల్లో నకిలీవి కూడా ఉన్నాయి. ఒకరికి రెండు మూడు పాన్ కార్డులు కూడా ఉన్నాయి. అందుకే పాన్ నెంబర్ను ఆధార్తో లింక్ చేస్తే నకిలీ కార్డులు బయటపడతాయి.

మ్యుచువల్ ఫండ్స్, డీమ్యాట్
మ్యుచువల్ ఫండ్స్లో టీఈఆర్ (టోటల్ ఎక్స్పెన్స్ రేషియో) ఛార్జ్ను 2020 ఆర్థిక సంవత్సరం నుంచి మార్చనున్నారు. ఈక్విటీ పథకాలు కాకుండా, ఇతర స్కీంలకు 1% టీఈఆర్ ఉండనుంది. సమీపంలో ముగిసే స్కీంలకు 2.25 శాతం ఉండనుంది. అలాగే, భౌతికరూపంలోని షేర్లు ఏప్రిల్ 1వ తేదీలోగా డీమెటిరియలైజ్ చేయాలి. డీమ్యాట్ షేర్లు మాత్రమే చెల్లుబాటు అవుతాయి.

హౌసింగ్, జీఎస్టీ
ఏప్రిల్ 1వ తేదీ నుంచి హౌసింగ్ రంగంలో వడ్డీ రేటు 1 శాతానికి తగ్గనుంది. కొన్ని కేటగిరీలకు 5 శాతం వరకు ఉంది. ప్రస్తుతం ఈ కేటగిరీలు 8 శాతం, 12 శాతంగా ఉన్నాయి. కానీ ఇటీవల బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించింది.

ఉద్యోగం మారితే ఈపీఎఫ్ అప్లికేషన్ అవసరం లేదుఈపీఎఫ్ విషయంలోను ఏప్రిల్ 1వ తేదీ నుంచి మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇక నుంచి ఉద్యోగం మారినప్పుడు ఈపీఎఫ్ ట్రాన్సుఫర్ కోసం ప్రత్యేకంగా అప్లికేషన్ ఇవ్వవలసిన అవసరం లేదు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఎవరైనా ఉద్యోగం మారితే వారికి సులువు కానుంది. వారు ప్రత్యేకంగా అప్లికేషన్ ఇవ్వవలసిన అవసరం లేదు.
ఈపీఎఫ్ విషయంలోను ఏప్రిల్ 1వ తేదీ నుంచి మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇక నుంచి ఉద్యోగం మారినప్పుడు ఈపీఎఫ్ ట్రాన్సుఫర్ కోసం ప్రత్యేకంగా అప్లికేషన్ ఇవ్వవలసిన అవసరం లేదు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఎవరైనా ఉద్యోగం మారితే వారికి సులువు కానుంది. వారు ప్రత్యేకంగా అప్లికేషన్ ఇవ్వవలసిన అవసరం లేదు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications