ముంబై: ఎరిక్సన్ కంపెనీకి బకాయిలు చెల్లించిన నేపథ్యంలో అనిల్ అంబానీకి చెందిన ఆర్కామ్ షేర్లు లాభాల బాటపట్టాయి. మంగళవారం నాడు ట్రేడింగ్లో కంపెనీ షేర్లు 10 శాతానికి పైగా లాభాల్లో కనిపించాయి. ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో బీఎస్ఈలో కంపెనీ షేరు ధర 10 శాతం లాభంతో రూ. 4.4 వద్ద ట్రేడ్ అయింది. రిలయన్స్ గ్రూప్నకు చెందిన ఇతర కంపెనీలు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ పవర్, హోమ్ ఫైనాన్స్, నావెల్, నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఫిబ్రవరి 26వ తేదీ తర్వాత ఆర్కామ్కు ఇదే అతిపెద్ద లాభం. మంగళవారం నాడు బీఎస్ఈలోని అత్యధిక లాభం పొందిన సంస్థ ఆర్కామ్. అలాగే బీఎస్ఈ టాప్ 500 ఇండెక్స్లో కూడా నిలిచింది. గత కొద్ది రోజులుగా ఆర్కామ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఎరిక్సన్కు బకాయిలు, వడ్డీ, జరిమానాలతో కలిపి రూ.550 కోట్లు చెల్లించేందుకు ఆర్కాంకు సుప్రీం కోర్టు మార్చి 19 వరకు గడువు ఇచ్చింది. ఈ లోగా డబ్బులు చెల్లించకుంటే జైలుకు వెళ్తారని కోర్టు హెచ్చరించింది. అనిల్ అన్న ముఖేష్ అంబానీ కష్టకాలంలో తమ్ముడ్ని ఆదుకున్నారు. ఆర్కామ్ కష్టాల నుంచి గట్టెక్కడంతో షేర్లు జోరందుకున్నాయి.
స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం స్వల్పలాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.40 సమయంలో సెన్సెక్స్ 83 పాయింట్ల లాభంతో 38,167 వద్ద, నిఫ్టీ 38 పాయింట్ల లాభంతో 11,500 వద్ద ట్రేడ్ అయ్యాయి. రూపాయి స్వల్పంగా 2 పైసలు విలువ కోల్పోయి 68.55 ట్రేడింగ్ను మొదలుపెట్టింది. ఆ తర్వాత బలపడి 9.45 సమయంలో 68.42 వద్ద ట్రేడవుతోంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications