కొనుగోళ్లు లేక ఉత్పత్తిని తగ్గించిన మారుతి సుజికి

కోత్త జనరేషన్ వాహనాలు ఉత్పత్తి, వినియోగదారుల నుండి సరైన డిమాండ్ లేకపోవడంతో పాటు ఇన్యూరెన్స్ రేట్లు , పెట్రోల్,డిజిల్ రేట్లు పెరగడంతో తమ ప్యాసింజర్ వాహానాల ఉత్పత్తి మారుతి సుజికి తగ్గంచింది. ఈనేపథ్యంలోనే గత సంవత్సరంతో పోల్చితే 27 శాతం వాహనాలు ఉత్పత్తి తగ్గించినట్టు కంపనీ అధికారులు తెలిపారు..కాగా గత సంవత్సరం ఫబ్రవరిలో 1 లక్ష 72 వేల ప్యాసింజర్ వాహానాలను ఉత్పత్తి చేయగా ఈ సంవత్సరం ఫిబ్రవరి లో 1 లక్ష 26 వేలు మాత్రమే ఉత్పత్తి జరిగింది.దీంతో సుమారు 27 శాతం వాహానాల ఉత్పత్తికి బ్రేక్ వేశారు...

ఉత్పత్తి తగ్గించడానికి ప్రధాన కారణం మాత్రం కాలుష్య ఉద్గారాలను తగ్గించడంలో భాగంగా సుప్రిం కోర్గు తీర్పు మేరకు 2020 ఎప్రిల్ నుండి ఫిఫ్త్ జనరేషన్ వెహికిల్స్ ను మార్కెట్ లోకి రానున్నాయి.దీంతో సాధరణ ఎన్నికలు ఉండడం కూడ ఇందుకు దోహదపడ్డాయి.దీంతో ఉత్పత్తికి బ్రేకులు వేశామని మారుతి సుజికి చైర్మన్ ఆర్‌సి భార్గవ్ చెప్పారు. కాగా బిఎస్ 4 వెహికిల్స్ ను ఉత్పత్తి ని సైతం 2019 చివరికల్లా నిలిపివేస్తామని ఆయన చెప్పారు..వీటితోపాటు ఆదనంగా వెహికిల్స్ లోన్స్ లో పై ఇంట్రస్ట్ రేట్ పెరగడం ,పెట్రోల్ ,డీజిల్ రేట్ల ప్రభావం కూడ వీటి తగ్గింపు కారణమని చెప్పారు.

 Maruti Suzuki slashes car production by nearly 27%

అయితే కోత్త మాడల్ లాంచ్ భాగంగా , ఆఫర్లను కంపనీ ప్రకటిస్తోంది.దీంతో జనవరి మార్చి నెలల్లో ఉత్పత్తి అమ్మకాలు పెరిగే అవకాశాలు ఉన్నట్టు ఆయన స్పష్టం చేశారు.కాగా మూడు నెలల ఆర్ధిక మాసానికి గాను మరో అయిదు శాతం కొనుగోళ్లు పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నట్టు ఆయన తెలిపారు.

కాగా ఈ ఆర్ధిక సంవత్సరం ఆక్టోబర్ ,డిశంబర్ మాసాలకు గాను 20 వేల 585 కోట్ల రాబడి ఉండగా గత సంవత్సరంలో ఇదే కాలానికి 19 వేల కోట్ల 528 కోట్ల రుపాయల రాబడి నమోదైంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+