ఆదివారం వరకు రియల్ ఎస్టేట్, లాటరీపై పన్నుల రేట్లపై నిర్ణయం వాయిదా వేసిన జిఎస్టీ కౌన్సిల్
రియల్ ఎస్టేట్ మరియు లాటరీలపై పన్నుల రేట్ల నిర్ణయయాన్ని జీఎస్టి కౌన్సిల్ వాయిదా వేసింది..దీంతో పాటు జనవరి రిటర్నును ధాఖలు చేసేందుకు శుక్రవారం వరకు పోడిగించింది...బుధవారం సమావేశమైన జిఎస్టి కౌన్సిల్ రియల్ ఎస్టేట్ రంగం మరియు లాటరీలపై పన్ను రేట్ల నిర్ణయాన్ని ఆదివారం వరకు వాయిదా వేసింది...ఆది వారం వీటిపై చర్చించేందుకు మరోసారి సమావేశం కానున్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లి తెలిపారు..కాగా జనవరి రిటర్న్ ధాఖలు తేదీని మరో రెండు రోజులు పోడిగించింది..కాగా ఎక్కువ సంఖ్యలో రిటర్న్ లు వస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు జైట్లీ తెలిపారు...అయితే జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మాత్రం ఫిబ్రవరి 28 వరకు పోడిగించింది..
అయితే రియల్ ఎస్టేట్ రంగం లో పన్నుల అంశంపై పలు రాష్ల్రాతో నేరుగా చర్చించాల్సి ఉండడం వల్ల వాయిదా వేసినట్టు జైట్లీ తెలిపారు..కాగా జీఎస్టి కౌన్సిల్ ఫిబ్రవరి 24 న మరోసారి భేటి అయి దీనిపై నిర్ణయం తీసుకోనుంది..