సుమారు పన్నేండువేల కోట్ల రుపాయలను ఐడిబిఐ ప్రోవిజన్ల కోసం అందించిన ఏల్ఐసి...
ఐడిబిఐ ప్రోవిజన్ల నిమిత్తం సుమారు 12 వేల కోట్ల రుపాయలను ఎల్ఐసి సమకూర్చినట్టు సమాచారం.... ఇప్పటికే ఎల్ఐసీ సంస్థ ఐడీబీఐ బ్యాంక్లో దాదాపు 51శాతం వాటాను కొనుగోలు చేసింది. జనవరి 21నాటికి ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తి అయింది. బ్యాంక్ మొత్తం రూ.21,624 కోట్లమేరకు మూలధనాన్ని అందుకొంది. ఇటీవల ఐడీబీఐ బ్యాంక్ మూలధన అవసరాలను తీర్చే అంశాన్ని బ్యాంక్, ఎల్ఐసీ అధికారులు ఆర్థికశాఖ ముందుకు తీసుకొచ్చారు.
మరోసారి ఎన్పీఏల్లో కొట్టుమిట్టాడుతున్న ఐడీబీఐను అదుకొనేందుకు ఎల్ఐసీ చర్యలు చేపట్టింది. జనవరి-మార్చి త్రైమాసికం ఎన్పీఏల ప్రొవిజన్ల ఏర్పాటుకు ఈమొత్తం చాలా అవసరం. మూడో త్రైమాసికానికి సంబంధించి ఐడీబీఐ నష్టాలు పెరిగి రూ.4,185 కోట్లకు చేరాయి. అదే సమయంలో ఆదాయం కుంగి రూ.7,125 కోట్ల నుంచి రూ.6,190 కోట్లకు చేరింది. దీంతో ఎన్పీఏలు కూడా 24.72శాతం నుంచి 29.67శాతానికి చేరాయి. మొండిబకాయిల ప్రొవిజన్ల కింద రూ.5,074కోట్లకు చేరింది.