ప్రపంచంలో బెంగుళూర్ లో అద్దేల పెరుగుదల రేటు ఎక్కువ.....
హైద్రబాద్... అత్యధిక అద్దేలు బెంగుళూర్ లో పెరగబోతున్నాయి....కార్యాలయాల అద్దేలు పెరగడంలో ప్రపచంలోనే మూడవ స్థానంలో ఉంది...కాగా ఢిల్లి నాల్గవ స్థానంలో ఉన్నట్టు పలు నివేదికలు తెలిపాయి...బెంగుళూరు లో చదరపు అడుగు 125 రుపాయలు ఉండగా దాని పెరుగుదల శాతం ఈ సంవత్సరం అంతానికి గాను 6.6 శాతంగా ఉండోచ్చని అంచనా వేస్తున్నారు.. ఢిల్లిలో 6.5 శాతం ,కాగా ముంబాయిలో ఎక్కువగా పెరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికే చదరపు అడుగుకు 300 రుపాయాలుగా ఉంది..దీంతో ఇక్కడ పెరుగుదల శాతం కేవలం ఒక్క శాతం మేరకే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి..
ప్రధానంగా ఐటి అధారిత పరిశ్రమలకు ఎక్కువగా భవనాలు అడుగుండడం,,వాటికి సరిపడ భవనాలు లేకపోవడం వల్ల అద్దేలు పెరుగుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు..ఈనేపథ్యంలోనే అద్దేలో పెరుగుదల కనిపిస్తుండడంతో వాణిజ్యదారులు స్వంతగా భవనాలు కొనుగోలు చేసేందుకు ముందుకువస్తున్నారు...
కాగా వాణిజ్య భవనాల లీజులో గతంలో ఎప్పుడు లేనంతగా 46 మిలియన్ చదరపు అడుగుల మేర లీజులకు ఒప్పందాలు కుదిరాయి.ఇది గత ఏడాదితో పోలిస్తే చాల ఎక్కువగా ఉంది...ఈ నేపథ్యంలోనే అద్దే భవనాల సరఫరా లేవు...దీంతో అద్దేలు పెరుగుతున్నాయని రియల్ వ్యాపాస్థులు తెలుపుతున్నారు....