జిఎస్టి లో ఫైల్ రిటర్స్ ధాఖాలుకు ప్రత్యేక కోర్సు..
హైద్రబాద్ ; జిఎస్టిలో ప్రత్యేక కోర్సు..వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రారంభించనున్నఐసిఏఐ ,సుమారు లక్షమంది కోర్సు ను అందించనున్న ఐసిఏఐ .విధివిధానాలపై కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో చర్చ...బికాం చదివిన విద్యార్థులు ఈ కోర్సుకు అర్హులు...
జీఎస్టి తీసుకువచ్చిన తర్వాత వ్యాపార రంగంలో పెను మార్పులు వచ్చాయి.. జిఎస్టి లేకుండా అతి చిన్న వ్యాపారం కూడ జరిగే పరిస్థితి కనిపించడం లేదు..దీంతో ప్రతి ఒక్కరు జిఎస్టి అంటూ పరుగులు తీస్తున్నారు..అయితే ఇది పూర్తిగా వ్యాపార పరమైన విషయం కావడంతో దానికి సంబంధించి విధివిధానాలు ఎలా ఉంటాయి,,వాటిని వ్యాపారస్తులకు ఏవిధంగా అందించాలనే వాటికి చాల మందికి తెలియని పరిస్థితి నెలకొంది..దీంతో చిన్న,మరియు మధ్యతరగతి వ్యాపారస్థులు తమ రిటర్న్ ను దాఖలు చేయడంలో ఇబ్బందులను ఏదుర్కోంటున్నాయి....
పై ఇబ్బందులకు కారణం సరైన మానవ వనరులు లేకపోవడంగా గుర్తించింది..ఐసితఏఐ వీటిని కోసం మానవ వనరులను పెంచడమే మార్గంగా జిఎస్టి ప్రత్యేక కోర్సును తీసుకువస్తుంది ఐసిఏఐ సుమారు లక్షమంది విద్యార్దులకు ఈ కోర్సును అందించాలని భావిస్తోంది..ఈ కోర్సుకు సంభంధించిన విధివిధానాలపై ఇప్పటికే కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో చర్చిస్తున్నారు..
కాగా ఈ కోర్సుకు బికాం విద్యార్హతతో పాటు 50 గంటల క్లాస్ రూం శిక్షణను అందించనుండగా మరో పది గంటలపాటు ప్రాక్టికల్ గా ఫైలింగ్ విధానాన్ని నేర్పనున్నారు..అయితే కోర్సుకు సంబంధించి ఫీజుగా 5000 వేల రూపాయలు ఉండనుంది ..అయితే ఈ మొత్తాన్ని కేంద్రమే భరించనుంది...