ఎఫ్డీఐ కొత్త నిబంధనలు: వాల్మార్ట్ను హెచ్చరించిన మోర్గాన్స్టాన్లీ
న్యూఢిల్లీ: భారత దేశంలో లాభాలు రాకుంటే వాల్మార్ట్ సంస్థ వెంటనే వైదొలగాలని వాల్మార్ట్కు ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ మోర్గాన్స్టాన్లీ సూచించింది. కొత్తగా అమలులోకి వచ్చిన ఎఫ్డీఐ నిబంధనలు వ్యాపారాన్ని కష్టంగా మార్చడం, ఫ్లిప్కార్టులో లాభాల్లో అనిశ్చితి నేపథ్యంలో పైవిధంగా చెప్పింది.
చైనాలో వ్యాపారం లాభదాయకం కాదని తేలిన వెంటనే అమెజాన్ 2017వ సంవత్సరంలో మార్కెట్ నుంచి వైదొలిగిందని పేర్కొంది. 2017 మేలో వాల్మార్ట్ కంపెనీ దాదాపు పదహారు బిలియన్ డాలర్లను వెచ్చించి ఫ్లిప్కార్ట్లో డెబ్బై ఏడు శాతం వాటాను కొనుగోలు చేసింది.
అప్పట్లో దీని విలువ ఇరవై బిలియన్ డాలర్లుగా పేర్కొన్నారు. ఈ డీల్తో వాల్మార్ట్ భారతీయ మార్కెట్లో నేరుగా అమెజాన్తో తలపడింది. కొత్తగా అమలులోకి వచ్చిన నిబంధనలకు అనుగుణంగా తన వ్యూహాన్ని మార్చుకొని వాల్మార్ట్ భారత్లో కొనసాగుతుందని తెలిపింది. అయితే కొత్త నిబంధనలు ఫ్లిప్కార్ట్, అమెజాన్ల విక్రయాలను బాగా దెబ్బ తీస్తాయని మోర్గాన్స్టాన్లీ అంచనా వేసింది.