జియో ఫోన్ ఉంటే మీకో శుభవార్త: 'జియో రైల్' యాప్ ద్వారా ట్రైన్ టిక్కెట్స్ బుక్ చేసుకోవచ్చు
ముంబై: జియో ఫోన్ వినియోగించే వారికి ఓ శుభవార్త. ఇక నుంచి జియో రైల్ యాప్ ద్వారా కూడా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం సరికొత్తగా న్యూ జియో రైల్ యాప్ను తీసుకు వచ్చింది.
రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ఐఆర్సీటీసీ యాప్ ఉంది. అందులో బుక్ చేసుకున్నట్లే జియో రైల్ యాప్ ద్వారా ఇక నుంచి టిక్కెట్లు బుక్ చేసుకునే వీలు కల్పించింది.
ఈ యాప్ ద్వారా ప్రయాణం చేయాలనుకునే వారు డెబిట్, క్రెడిట్ కార్డులు, ఈ వాలెట్లను ఉపయోగించి రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. రైళ్ల రాకపోకలకు సంబంధించిన సమాచారం, పీఎన్ఆర్ స్టేటస్, సీట్ల లభ్యత, టిక్కెట్ల రద్దు వంటి సేవలు కూడా ఉంటాయి.
తత్కాల్ టిక్కెట్లను కూడా ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. వినియోగిదారులకు ఐఆర్సీటీసీ ఖాతా లేకపోయినప్పటికీ జియో రైల్ యాప్లో కొత్త ఖాతా తెరువవచ్చు. ఈ యాప్ జియో యాప్ స్టోర్లో ఉంది.