పవన్ కళ్యాణ్ పథకాలు చూస్తే దిమ్మతిరిగి బొమ్మ కనిపిస్తుంది
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ ప్రీ- మేనిఫెస్టో విడుదల చేశారు అవి ఏంటో చూద్దాం.
- మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు
- గృహిణిలకు ఉచితంగా గ్యాస్ సీలిండర్లు
- రేషన్ బదులు గృహిణుల ఖాతాలో రూ.2500 నుంచి రూ.3000 నగదు
- బీసీ లకి 5 శాతం రిజర్వేషన్ పెంపుదల
- చట్టసభలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు
- ఎస్. సి వర్గీకరణకు సామరస్య పరిష్కారం
- 170 నియోగకరవర్గాలకు 170 మేనిఫెస్టోలు
- ఆర్ధికంగా వెనుక పడిన అగ్రవర్గాల విద్యార్ధులకి వసతి గృహాలు
- వృద్దుల కోసం ప్రభుత్వ ఆశ్రయాలు
-
ప్రభుత్వ
ఉద్యోగుల
సి.
పి.
ఎస్
విధానం
రద్దు.
గ్లాసు గుర్తు క్రేజ్:
ఇక జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును కేటాయించడంతో జనసేన పార్టీ వర్గాల్లో నూతనోత్సాహం కనిపిస్తుంది. తమ పార్టీకి ఎన్నికల గుర్తు రావడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో తన ఆనందాన్ని వ్యక్తం చేసి, జనసైనికులు అందరూ తమ పార్టీ గుర్తును బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలువు ఇవ్వడంతో కార్యకర్తలు అందరూ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగారు.
జనసేన కార్యకర్తలు:
పార్టీ అభిమానులు, జనసేన కార్యకర్తలు అందరూ సోషల్ మీడియాను వేదికగా చేసుకుని గాజు గ్లాసులో టీ తాగే ఫోటోలు పోస్టు చేస్తూ ఒకవైపు ప్రచారం చేస్తున్నారు. ఇదిలాఉంటే పోటీ చేసే అభ్యర్ధులు పార్టీ ఎన్నికల గుర్తు అయిన గ్లాసులను పెద్దఎత్తున కొనుగోలు చేసి ప్రచారం చేస్తున్నారు.
గ్లాసు ధర:
సాధారణంగా గాజు గ్లాసు ధర 10 నుంచి 15 రూపాయల ధర ఉంటే ఇప్పుడు ఆ గ్లాసు ధర 50 రూపాయలు నుంచి 60 రూపాయలు వరకూ పలుకుతోంది. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా గాజు గ్లాసుల వినియోగం బాగా తగ్గిపోవడం మార్కెట్లో గ్లాసులు అందుబాటులో లేకపోవడంతో డిమాండ్ ఆసరాగా చేసుకుని రేటు పెంచేశారు మార్కెట్దారులు. డిస్పోజ్బుల్ గ్లాసులు విరివిగా వాడుతున్న నేటి రోజుల్లో జనసేన పార్టీ మూలంగా గాజు గ్లాసులకు భలే గిరాకీ వచ్చినట్టుంది.
రాంచరణ్:
తాజాగా ఈ గ్లాస్ గురించి రాంచరణ్ తన వినయ విధేయ రామ ఆడియో ఫంక్షన్ లో కూడా చెప్పారు అందరు ఇప్పుడు ఈ టీ గ్లాస్ వాడుతున్నారు అని అంతేకాక మొన్న విడుదలైన పేట సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సినిమాలో కూడా ఒక షాట్ ఈ గ్లాస్ మీద చూపించారు.ఇలా చూపించిన వెంటనే పవన్ కళ్యాణ్ అభిమానులు థియేటర్ దద్దరిలిపోయేలాగా అరుపులు