13 ఏళ్ళ బాలుడి వినూత్న స్టార్టుప్ రూ.100 కోట్లు లక్ష్యంగా.....
తిలక్ మెహతా వయస్సు కానీ అతడికి బిజినెస్ మ్యాన్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.పైగా ఈ పిల్లాడిని నమ్మి ఒక బ్యాంకర్ తన ఉద్యోగాని విడిచిపెట్టి ఇతని స్టార్ట్ అప్ కంపెనీలో CEO గా చేరడం విశేషం
ముంబై లో ఈ కంపెనీ స్థాపించిన కొద్దీ సేపటిలోనే విజయవంతంగా అడుగులు వేస్తోంది పైగా ఈ కంపెనీ రూ.100 కోట్ల టార్గెట్ పెట్టుకొంది.
తిలక్ మెహతా నిర్వహిస్తున్న ఈ కంపెనీ పేరు పేపర్స్ అండ్ పార్సెల్స్ చిన్నిపాటి పార్సెల్ ను బట్వాడా చేయడం ఈ కంపెనీ పని.
కంపెనీ వ్యవస్థాపకుడు తిలక్ మాట్లాడుతూ గత ఏడాది పట్నంలో నుంచి వేరే ప్రాంతం నుంచి పుస్తకాలు తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది.పని వత్తిడి కారణంగా నాన్న తీసుకురాలేకపోయాడు .
మరో మార్గం లేక ఇబ్బంది పడ్డాను సరిగ్గా అప్పుడే నాకు ఈ బిజినెస్ ఐడియా వచ్చింది అని చెప్పాడు . ముంబై లోని డబ్బావాలా వారి సాయంతో తిలక్ తన వ్యాపారాన్ని నడిపిస్తున్నాడు.