వరుసగా ఐదవరోజు లాభాల్లో దూసుకెళ్తున్న రిలయన్స్ షేర్లు.
ఆయిల్-టు-టెలికాం ప్రధాన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర గురువారం వరుసగా ఐదవ రోజు లాభాల్లో దూసుకెళ్తోంది.
ఆయిల్-టు-టెలికాం ప్రధాన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర గురువారం వరుసగా ఐదవ రోజు లాభాల్లో దూసుకెళ్తోంది. ఇది 2018 నాటికి TCS తర్వాత 100 బిలియన్ డాలర్ల క్యాపిటలైజేషన్ను సాధించిన రెండవ సంస్థగా రికార్డు నమోదుచేసింది.
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రికార్డు ధర స్థాయిలో రూ. 6,96,255.58 కోట్లు, టిసిఎస్ రూ .7,55,301.31 కోట్లు. (ఒక US డాలర్ = రూ .68.64).
దశాబ్దకాలం తర్వాత ఈ కంపెనీ 100 బిలియన్ డాలర్ల మార్కును చేరుకోవడం ఇదే ప్రధమం. ఇంతకు ముందు 2008 జనవరిలో ఇది 100 బిలియన్ డాలర్ల క్లబ్లోకి అడుగుపెట్టినప్పుడు రూపాయి మారకం విలువ 40 దగ్గర ఉన్నింది.
బీఎస్ఈ సెన్సెక్స్ తాజాగా రికార్డు స్థాయిలో 43,6 పాయింట్లు వృద్ధి చెంది 36,699.53 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ తాజాగా రికార్డుస్థాయిలో 434 పాయింట్ల వద్ద రికార్డు సృష్టించింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 2018 ఫిబ్రవరి 1 నుంచి తొలిసారిగా 11,000 మార్కులను తిరిగి పొందింది. అంతకు ముందు జనవరిలో 11,171.55 పాయింట్ల రికార్డు నమోదైంది.
జూలై 5 న జరిగిన వార్షిక సాధారణ సమావేశం తరువాత రిల్ స్టాక్లో జరిగిన ర్యాలీ ప్రారంభమైంది.వార్షిక సమావేశం జరిగిన నాటి నుంచి నేటి వరకు అంటే ఐదు ట్రేడింగ్ సెషన్లలో కంపెనీ షేర్లు 10శాతం పైగా లాభపడ్డాయి.సంస్థ షేర్లు సరికొత్త రికార్డులు సాధించిందని పేర్కొన్నారు.