బంపర్ ఆఫర్..! ఎలక్ట్రిక్ వాహనాలు కొంటే భారీ నజరానా ఏంటో తెలుసా?
వాయు కాలుష్యం తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించడానికి సిద్ధం అవుతోంది. అది ఏంటో తెలుసా మీరే చూడండి.
ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వాహనాలను
ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వాహనాలను కొనుగోలు చేసే వారికీ రూ.2 .50 లక్షలు ఇచ్చే అవకాశం ఉంది అంట. పాత పెట్రోల్ డీజల్ వాహనాలు పక్కన పడేసి ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే లాగా ఈ ఆఫర్ ప్రకటించనుంది.
రూ.1.50 లక్ష దాక
రూ.1.50 లక్ష దాక ఎలక్ట్రిక్ టూ వీలర్ ను కొనే వరకు రూ.30,000 వెల వరకు ప్రోత్సహం అందించాలి అని ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా విధానాలలో ప్రకటించింది.
మొత్తం రూ.1500 కోట్లు ఖర్చు
ఇక రూ.15 లక్షల వరకు ఉన్న వాహనాలను కొనే వారికి రూ.1 .50 లక్షల నుంచి రూ.2 .50 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇలా ప్రోసహాకోసం వచ్చే 5 ఏళ్లలో మొత్తం రూ.1500 కోట్లు ఖర్చు చేయాలనీ అనుకుంటున్నారు.
ఛార్జింగ్ స్టేషన్లు
ఇక దేశవ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి మరో రూ.1000 కోట్లు కేటాయించనున్నారు. మెట్రో నగరం 10 లక్షల పైగా జనాభా ఉన్న నగరాలూ , గుర్తింపు పొందిన స్మార్ట్ సిటీలలో ప్రతి 9 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చెయ్యాలని భావిస్తున్నారు.