ఈసారి టీ.టీ.డీ వార్షిక బడ్జెట్ ప్రకటించిన ప్రభుత్వం తెలిస్తే షాక్ అవుతారు ఎంతో తెలుసా?
టీ.టీ.డీ 2018-19 వార్షిక బడ్జెట్ రూ.2,893.94 కోట్లకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. వార్షిక బడ్జెట్ నివేదికను టీటీడీ గత 6వ తేదీన ప్రభుత్వానికి పంపిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రదేవదాయశాఖ ముఖ్యకార్యదర్శి మన్మోహన్ సింగ్ ఆమోదముద్ర వేసి పంపారు.
గతేడాది, ప్రస్తుత ఏడాది అంచనాలు ఇలా ఉన్నాయి.
ఆదాయం: గతేడాది కంటే ప్రస్తుతం హుండీఆదాయం, ఆర్జి తసేవలు, తలనీలాలు, లడ్డూల విక్రయం, రుణాలు, డాలర్స్ విక్రయం ద్వారా వచ్చే ఆదాయాలు పెరిగాయి. పెట్టుబడులు, బ్రేకు దర్శనం, రూ.300 టికెట్లు, గదుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గింది.
ఖర్చులు: గతేడాది కంటే ప్రస్తుతం జీతాలు, మార్కెటింగ్ కొనుగోళ్లు, సహాయనిధులు, ఇంజినీరింగ్, వివిధ ట్రస్టులకు, రిపేర్లకు, రుణాలు, ఇతర అవరాలకు ఖర్చులు పెరిగాయి. ప్రస్తుతం అవుట్ సోర్సింగ్, విద్యుత్ ఉత్పత్తికి అయ్యే ఖర్చులు తగ్గగా, పెన్షన్, ఫండ్స్కు మాత్రమే యథాతథంగా ఉన్నాయి.
ఫోటో కర్టసీ ఏబిన్.