IPL క్రికెట్ బెట్టింగ్ గా మజాకా
ప్రతి ఏటా ఏప్రిల్ మాసం లో మొదలవుతుంది.ప్రతి ఏటా సుమారు 2000 వేళా కోట్ల దాక బెట్టింగులు జరగొచ్చని అంచనా.
మన దేశం లో క్రీడలకు చాల ప్రాముఖ్యత ఉంది వాటిలో ముక్యంగా చెప్పాలంటే క్రికెట్.ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్రీడల ఆదాయం చూస్తే క్రికెట్ అత్యధిక ఆదాయం సంపాదిస్తోంది .మొట్టమొదట క్రికెట్ ఆట ఇంగ్లాండ్ లో మొదలై క్రమంగా ప్రపంచానికి పరిచయమైనది.ప్రస్తుతం అన్ని దేశాలు ఈ క్రికెట్ ఆటలో పాల్గొంటున్నాయి.ప్రస్తుతం మన భారత దేశ క్రికెట్ బోర్డు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ అసోసియేషన్ గా పేరు గాంచింది. క్రీడాభిమానులు అత్యధికంగా మన దేశంలో ఉండటం విశేషం,.మన క్రికెట్ బోర్డు ప్రతి ఏట వివిధ దేశాలకు మరియు సంస్థలకు సంబంధించి మ్యాచ్లు నిర్వహిస్తుంటారు ఉదాహరణకి TEST మ్యాచ్,ODI మ్యాచ్ ,T20 మ్యాచ్,మినీ ప్రపంచ కప్ మ్యాచ్,ప్రపంచ కప్ మ్యాచ్ మరియు సంస్తల కు సంబంధించి చెప్పాలంటే TVS కప్,HERO కప్,HUNDAI కప్,MARUTHI SUZUKI కప్ లాంటివి ఎన్నో జరుగుతుంటాయి.వీటన్నిటిలో ప్రతి ఏటా నిర్వహించే IPL బాగా ప్రాముఖ్యతను సంతరించుకుంది.అసలు ఇంత ప్రాముఖ్యత ఎందుకనే విషయం నేను మీకు చెప్పబోతున్న...
IPL(ఐ పి యల్):
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL ) 2007 లో BCCI చే స్థాపించబడింది.ప్రతి ఏటా ఏప్రిల్ మాసం లో మొదలవుతుంది.సుమారు రెండు నెలలు జరిగే ఈ IPL లో 8 జట్టులు ఉంటాయి.ఇతర దేశాల వారు ప్రతి జట్టు లో 4 ఉంటారు.ఇందులో రెండు సెమి ఫైనల్ మ్యాచ్ లు ఒక ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.
ఆదాయం:
ఐపిఎల్ ప్రపంచంలోని అత్యధికంగా ప్రేక్షకులు హాజరయ్యే క్రికెట్ లీగ్, 2014 లో అన్ని స్పోర్ట్స్ లీగ్లలో సగటు హాజరయ్యే సంఖ్యలో ఆరవ స్థానంలో ఉంది. 2010 లో, ఐపిఎల్ ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి క్రీడా కార్యక్రమంగా YouTube లో ప్రసారం చేయబడింది. ప్రస్తుతం IPL యొక్క బ్రాండ్ విలువ 2017 లో 5.3 బిలియన్ డాలర్లు. BCCI ప్రకారం, 2015 IPL సీజన్ భారతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క GDP కి 11.5 బిలియన్ డాలర్లు (US $ 182 మిలియన్లు) దోహదపడింది.
IPL జూదం:
క్రికెట్ తెర వెనుక నడిపించేది ఈ బెట్టింగ్ ప్రపంచ వ్యాప్తంగా జూదాలు,గ్యాంళింగులు చాలానే జరుగుతుంటాయి.2010 నుండి IPL బెట్టింగులు ఊపందుకున్నాయి.ఈ జట్టు గెలుస్తుంది ఈ ప్లేయర్ ఎంత కొడతాడు పలానా టీం మీద బెట్టింగ్ గెలవడం కాయం అని రకరకాల బెట్టింగులు జరుగుతుంటాయి.ప్రతి ఏటా సుమారు 2000 వేళా కోట్ల దాక బెట్టింగులు జరగొచ్చని అంచనా.
ప్రకటనల ద్వారా:
మ్యాచ్ మధ్య లో వచ్చే ప్రకటనల ద్వారా ఏటా సుమారు కొన్ని వందల కోట్లుక్రికెట్ సంస్థ గడిస్తోంది
అధిక మొత్తంలో పంద్యాలు జరిగే రాష్ట్రాలు:
ముంబై.ఢిల్లీ ,గోవా,బెంగుళూరు,హైదరాబాద్ గత కొన్ని సంవత్సరాలుగా ipl బెట్టింగులు ఈ రాష్ట్రాల నుండే ఎక్కువగా జరుగుతాయని అంటున్నారు.
హైదరాబాద్:
ప్రతి ఏట ఒక్క హైదరాబాద్ లోనే సుమారు 100 కోట్లకు పైగా బెట్టింగ్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు.
పందెం తీరు:
పందాలు నడిపే వారిని బుకీలు అని పిలుస్తారు వీరు ఒక గ్రూప్ గా ఏర్పడి అందరు ఒకచోట చేరి టీవీ లు లాప్ టాప్ లు మరియు సెల్ ఫోన్ల ద్వారా బెట్టింగ్ కార్య కలాపాలు నిర్వహిస్తూ ఉంటారు.వీళ్ళు ఒక మ్యాచ్ కి కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతాయని ఆశ్చర్య పోనక్కర్లేదు.
యువత:
ipl సీజను వస్తోందంటే చాలు యువత అధిక సంఖ్యలో బెట్టింగులు కాయడానికి సిద్దపడతారు.పూర్తిగా రెండు నెలలు నిరంతరాయంగా జరిగే ఈ apl కి మంచి గిరాకీ ఉంటుంది.ఈ మాయలో పడి యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు కొన్ని చూట్ల ప్రాణాలు కూడా పోగొట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి.
పందెం డబ్బు వసూళ్లు:
పందాలు నిర్వహించే బుకీలు కొందరిని డబ్బు వాసులు చేసేందుకు నియమిస్తారు వీరు మ్యాచ్ ఐపోయిన వెంటనే డబ్బు వాసులు చేసుకొని ఆ మొత్తాన్ని నిర్వహణ వ్యక్తికి అందచేస్తారు.
ఆన్ లైన్ బెట్టింగులు:
ఇటీవల కాలంలో ఆన్ లైన్ బెట్టింగులు ఊపందుకున్నాయి వీటి కోసం ప్రత్యేకంగా కొన్ని యాప్స్ కూడా వచ్చాయి బెట్ 365 ,బెట్ ఫెయిర్ వంటివి ఉన్నాయి.
ఆకర్షణ:
క్రికెట్ పందాలు నిర్వహించే వాళ్లు ఒక మాఫియాగా ఏర్పాడి కొంతమందికి డబ్బు ఎర చాపి ఈ బెట్టింగ్ కూపంలోకి లాగుతారు మొదట సాఫీగానే సాగుతుంది కానీ చివరకు అప్పుల బారిన పడేస్తారు.
ipl జూదం వ్యసనం
కొంత మంది జూదానికి అలవాటు పడుతుంటారు,ఎలాంటి వాళ్ళు అస్తమానం పందెం గురించే ఆలోచిస్తూ ఉంటారు.పందెం అదందే వారికీ నిద్ర పట్టదు అనే దశకు చేరుకుంటారు.
చెట్టరిత్యా నేరం:
జూదం ఆడటం చెట్టరిత్యా నేరం కానీ పందాలు మాత్రం ఈమాత్రం ఆగడం లేదు.పందాలను అరికట్టేందుకు అనేక చట్టాలు వచిన్నపటికి అవి ఇంకా ఎక్కువ అవుతున్నాయి కానీ తగ్గడం లేదు ఇందులో చదువుకున్న యువత అధిక సంక్యలో ఉండటం గమనార్హం.