2018 బడ్జెట్లో పెట్రోల్,డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించనుందా
విశ్వసనీయ విర్గాల విశ్లేషణ ఆధారంగా పెట్రోలియం మరియు ఆర్ధిక మంత్రిత్వశాఖకు సమర్పించిన ముందస్తు బడ్జెట్ మెమోరాండం లో భాగంగా రెండు ఇంధనాల మీద ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని ప్రతిపాదించారు.
2013-14 లో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు $105 డాలర్లు ఒక బ్యారెల్,నుండి 2015-16, 2016-17 సంవత్సరాల్లో $46 డాలర్లకు పడిపోయింది.తరువాత కేంద్రం ఎక్సైజ్ సుకాలు తొమ్మిది సార్లు పెంచిన విషయం తెలిసిందే.
రికార్డు స్థాయికి చేరుకున్న పెట్రోల్ మరియు డీజిల్ రెండు ఇంధన ధరలను తగ్గించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.విశ్వసనీయ విర్గాల విశ్లేషణ ఆధారంగా పెట్రోలియం మరియు ఆర్ధిక మంత్రిత్వశాఖకు సమర్పించిన ముందస్తు బడ్జెట్ మెమోరాండం లో భాగంగా రెండు ఇంధనాల మీద ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని ప్రతిపాదించారు.రాజకీయంగా ఇంధన ధరల తగ్గింపు చాల సున్నితమైన అంశం అని దీని పై తుది నిర్ణయం కోసం అరుణ్ జెట్లే ప్రధాన మంత్రి తో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.
పెట్రోలియం శాఖ కార్యదర్శి కె.డి. త్రిపాఠి సోమవారం బడ్జెట్లో సిఫారసుల సమితిని ముందుకు తెచ్చారని,కానీ వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు. మంగళవారం పెట్రోల్ ధర ఢిల్లీలో రూ. 72.38 కు పెరిగింది. డీజిల్ ధర 63.20 రూపాయలకు పెరిగింది. డిసెంబరు మధ్యకాలం నుంచి ధరలు లీటరుకు 3.31 రూపాయలు పెరిగాయి.
చమురు కంపెనీలు లీటరుకు పెట్రోలు ధర 15 పైసలు, డీజిల్ ధర 19 పైసలు మంగళవారం నాడు అంతర్జాతీయ మార్కెట్లు తమ రోజువారీ అమరికలో భాగంగా పెంచాయి. ముంబైలో పెట్రోలు ధర లీటరుకు 80 రూపాయలు దాటింది. డీజిల్ ఖర్చులు పెరగడం ఇంధనంపై రాష్ట్రాల విధించిన వ్యాట్ వల్ల అధిక లావాదేవీలు చోటు చేసుకున్నాయి.