మూడు కొత్త కార్లను లాంచ్ చేసిన ఆడి ఇండియా
కొత్త మోడళ్ల ఏ5 స్పోర్ట్ బ్యాక్, ఏ5 క్యాబ్రియోలెట్,ఎస్5 స్పోర్ట్ బ్యాక్ ధరలు వరుసగా రూ.54.02 లక్షలు, రూ.67.15 లక్షలు, రూ.70.60 లక్షలుగా ఉన్నాయి
జర్మన్
ఆటో
దిగ్గజం
ఆడి
గురువారం
రోజు
మూడు
కొత్త
కార్లను
మార్కెట్లో
ప్రవేశపెట్టింది.
కొత్త
మోడళ్ల
ఏ5
స్పోర్ట్
బ్యాక్,
ఏ5
క్యాబ్రియోలెట్,ఎస్5
స్పోర్ట్
బ్యాక్
ధరలు
వరుసగా
రూ.54.02
లక్షలు,
రూ.67.15
లక్షలు,
రూ.70.60
లక్షలుగా
ఉన్నాయి.
ఏ5
స్పోర్ట్
బ్యాక్,
ఏ5
క్యాబ్రియోలెట్
మోడళ్లు
రెండూ
2
లీటర్
డీజిల్
ఇంజిన్
కలిగి
ఉండగా,
ఎస్5
స్పోర్ట్
బ్యాక్
మాత్రం
3
లీటర్
పెట్రోల్
ఇంజిన్తో
వచ్చింది.
కొత్తగా
ప్రవేశ
పెట్టిన
మూడు
మోడళ్లతో
ఆడి
ఇండియా
ఈ
ఏడాదికి
నిర్ణయించుకున్న
10
కొత్త
మోడళ్ల
లక్ష్యాన్ని
చేరుకున్నట్లయిందని
ఆడి
ఇండియా
అధిపతి
రాహిల్
అన్సారి
వెల్లడించారు.
"
ఆడి
ఏ5
రేంజ్
కార్లను
ప్రవేశపెట్టడంతో
తమ
ఉత్పత్తుల్లో
వైవిధ్యత
బలపడిందన్నారు.
దేశంలో
కొత్త
రకాల
కార్లను
ప్రవేశపెడుతూ
లగ్జరీ
కార్ల
విషయంలో
ఉత్తమమైన
వాటిని
అందిస్తుంటాం."
అని
కార్ల
లాంచ్
సందర్భంగా
అన్సారి
చెప్పారు.
కొత్త
ఆడి
ఏ5
యువతను
ఆకట్టుకునే
విధంగా
తయారు
చేశారని
ఆయన
వివరించారు.
ఆడి
గత
రెండేళ్లగా
అమ్మకాల
విషయంలో
వెనుకపడుతూ,
అంతకుముదు
నం.1
స్థానంలో
ఉన్న
ఆ
సంస్థ
గతేడాది
3వ
స్థానానికి
పడిపోయింది.
ఈ
విలాసవంతమైన
కార్ల
తయారీ
సంస్థ
2012
నుంచి
2014
మధ్య
సేల్స్
విషయంలో
ప్రథమ
స్థానంలో
ఉంది.
అయితే
2015లో
మెర్సిడెస్
మొదటి
స్థానానికి
దూసుకెళ్లడంతో
ఆడి
ప్రభ
తగ్గింది.
మరో
వైపు
జర్మనీ
కార్ల
తయారీ
సంస్థ
బీఎండబ్ల్యూ
ఆడిని
మూడో
స్థానానికి
నెట్టి
రెండో
స్థానాన్ని
ఆక్రమించింది.