ఒబామా పథకానికి ఇన్ఫీ, టీసీఎస్, విప్రో విరాళం
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘కంప్యూటర్ సైన్స్ ఫర్ ఆల్' పథకానికి సహకారం అందించేందుకు భారత ఐటీ దిగ్గజాలు టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ముందుకొచ్చాయి. ఈ పథకంతో అందరికీ కంప్యూటర్ విద్యను అందించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆర్ధిక వ్యవస్ధలో మార్పులు రావాలంటే అమెరికా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలో విద్యార్ధులందరికీ కంప్యూటర్ సైన్స్ను బోధించాలని ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. పిపిపి (పబ్లిక్- ప్రైవేట్ పార్టనర్షిప్) మోడల్లో ఈ పథకాన్ని నిర్వహించనున్నారు.
ఈ పథకం కోసం భారత్కు చెందిన టీసీఎస్, ఇన్ఫీ, విప్రో కంపెనీలు 30 లక్షల డాలర్ల పైచిలుకు గ్రాంటును కేటాయించాయి. ఇందులో భాగంగానే ఇన్ఫోసిస్ ఒక మిలియన్ డాలర్లు (దాదాపు రూ.6.8 కోట్లు) విరాళాన్ని ప్రకటించింది. అమెరికాలోని 27 పట్టణాల టీచర్లకు గ్రాంట్ల రూపంలో టీసీఎస్ సహకారం అందించనుంది.
విప్రో దీర్ఘకాలిక కార్యక్రమాల కోసం మిచిగన్ విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో 2.8 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.20 కోట్లు) విరాళాన్ని ప్రకటించింది. ఈ ప్రతిష్ఠాత్మక పథకం బరాక్ ఒబామా సొంత పట్టణమైన చికాగోలో ప్రారంభం కానుంది.
ఒబామా పథకానికి ఇన్ఫీ, టీసీఎస్, విప్రో విరాళం
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘కంప్యూటర్ సైన్స్ ఫర్ ఆల్' పథకానికి సహకారం అందించేందుకు భారత ఐటీ దిగ్గజాలు టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ముందుకొచ్చాయి. ఈ పథకంతో అందరికీ కంప్యూటర్ విద్యను అందించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఒబామా పథకానికి ఇన్ఫీ, టీసీఎస్, విప్రో విరాళం
ఆర్ధిక వ్యవస్ధలో మార్పులు రావాలంటే అమెరికా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలో విద్యార్ధులందరికీ కంప్యూటర్ సైన్స్ను బోధించాలని ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. పిపిపి (పబ్లిక్- ప్రైవేట్ పార్టనర్షిప్) మోడల్లో ఈ పథకాన్ని నిర్వహించనున్నారు.
ఒబామా పథకానికి ఇన్ఫీ, టీసీఎస్, విప్రో విరాళం
ఈ పథకం కోసం భారత్కు చెందిన టీసీఎస్, ఇన్ఫీ, విప్రో కంపెనీలు 30 లక్షల డాలర్ల పైచిలుకు గ్రాంటును కేటాయించాయి. ఇందులో భాగంగానే ఇన్ఫోసిస్ ఒక మిలియన్ డాలర్లు (దాదాపు రూ.6.8 కోట్లు) విరాళాన్ని ప్రకటించింది. అమెరికాలోని 27 పట్టణాల టీచర్లకు గ్రాంట్ల రూపంలో టీసీఎస్ సహకారం అందించనుంది.
ఒబామా పథకానికి ఇన్ఫీ, టీసీఎస్, విప్రో విరాళం
విప్రో దీర్ఘకాలిక కార్యక్రమాల కోసం మిచిగన్ విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో 2.8 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.20 కోట్లు) విరాళాన్ని ప్రకటించింది. ఈ ప్రతిష్ఠాత్మక పథకం బరాక్ ఒబామా సొంత పట్టణమైన చికాగోలో ప్రారంభం కానుంది.