ముంబై: జైల్లో శిక్షాకాలాన్ని అనుభవిస్తున్న 140 మంది ఖైదీలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఏటీఎం కార్డులు జారీ చేసింది. రాబోయే రోజుల్లో జైల్లో ఉన్న 800 మంది ఖైదీలకు ఈ సదుపాయాన్ని కల్పించాలనే ఉద్దేశంతో బ్యాంక్ అధికారులు ఉన్నారు.
వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని నాగ్పూర్ సెంట్రల్ జైలులో శిక్షను అనుభవిస్తున్న 140 మంది ఖైదీలకు ప్రయోగాత్మకంగా ఏటీఎం కార్డులు బుధవారం అందజేశారు. జైల్లో ఎంపిక చేసిన ఖైదీలకు మాత్రమే ఈ ఏటీఎం కార్డులను అందజేసినట్లు మహారాష్ట్ర అదనపు డీజీపీ(జైళ్లు) డాక్టర్ భూషణ్ కుమార్ ఉపాధ్యాయ వెల్లడించారు.

ఖైదీలకు ఎస్బీఐ ఏటీఎం కార్డులు
మహారాష్ట్రలోని 9 సెంట్రల్ జైళ్లలో 10,000 మందికి పైగా ఉన్న ఖైదీలకు భవిష్యత్తులో ఈ సేవలను విస్తరిస్తామని ఆయన తెలిపారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద ముందుగా నాగ్పూర్ సెంట్రల్ జైలుని ఎంచుకున్నామని ఈ సందర్భంగా చెప్పారు.

ఖైదీలకు ఎస్బీఐ ఏటీఎం కార్డులు
జైలు లోపల సబ్బులు, నూనె, తినుబండారాలు వంటి వాటిని కొనుగోలు చేసేందుకు ఖైదీలు ఈ కార్డులను ఉపయోగించుకోవచ్చన్నారు. అయితే నెలకు గరిష్ఠంగా రూ.2,500 మాత్రమే ఒక ఖైదీ ఖర్చు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఖైదీలకు ఎస్బీఐ ఏటీఎం కార్డులు
అంతేకాదు ఖైదీల బంధువులు కూడా సంబంధిత బ్యాంకు ఖాతాల్లో గరిష్ఠంగా రూ.2,500 వరకు మాత్రమే నగదును డిపాజిట్ చేసే అవకాశాన్ని కల్పించారు. శిక్ష పూర్తైన తర్వాత జైలు నుంచి విడుదలైన తర్వాతకూడా ఖైదీలు ఈ ఖాతాలను కొనసాగించవచ్చని ఆయన వెల్లడించారు.

ఖైదీలకు ఎస్బీఐ ఏటీఎం కార్డులు (ఫోటోలు)
జైలు ఆవరణలో ఖైదీల కోసం మూడు నెలల పాటు యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. జూన్ 21వ తేదీని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించినట్టు గుర్తు చేశారు. గతేడాది యోగా దినోత్సవం రోజున నాగ్పూర్ సెంట్రల్ జైలుని సందర్శించిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఖైదీలతో కలిసి యోగా చేశారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications