న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమం కింద దేశీయంగా నౌకా నిర్మాణ రంగానికి ఊతమిచ్చేలా కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా భారతో నిర్మించే నౌకలపై 20 శాతం మేర ఆర్ధిక సహాయం అందించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.
ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. పదేళ్ల పాటు అమల్లో ఉండే ఈ పథకానికి రూ. 4,000 కోట్ల మేర బడ్జెట్పరమైన మద్దతు అవసరమవుతుందని కేంద్ర ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.

మేకిన్ ఇండియా: నౌకా నిర్మాణానికి చేయూత
అందులో పెట్టుబడులు, టర్నోవర్ పరంగానే కాకుండా ఉపాధి అవకాశాలపరంగా కూడా మౌలిక రంగం స్థాయిలో ప్రభావం చూపే నౌకానిర్మాణం, నౌకల మరమ్మతు పరిశ్రమకు ప్రోత్సాహం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

మేకిన్ ఇండియా: నౌకా నిర్మాణానికి చేయూత
నౌకను డెలివరీ ఇచ్చిన తేదీ నుంచి ప్రారంభించి ఈ ఆర్ధిక సహాయాన్ని అందించనున్నారు. అంతేకాదు ప్రతి ఏటా ఈ సహాయాన్ని మూడు శాతం వంతున తగ్గిస్తారు. నౌకానిర్మాణ రంగానికి పన్నులపరమైన ప్రయోజనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగ హోదా తదితర అంశాలు కూడా తాజా ప్రతిపాదనలో ఉన్నాయి.

మేకిన్ ఇండియా: నౌకా నిర్మాణానికి చేయూత
మరోవైపు దేశంలోని 106 జలమార్గాలను జాతీయ జలమార్గాలుగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు జాతీయ జలమార్గాల బిల్లు 2015కి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం మన దేశంలో ఐదు జాతీయ జలమార్గాలున్నాయి.

మేకిన్ ఇండియా: నౌకా నిర్మాణానికి చేయూత
దీంతో పాటు ఆహార ధాన్యాల ప్యాకేజింగ్కు జూట్ బ్యాగ్ల వినియోగాన్ని తప్పనిసరి చేసే ప్రతిపాదనను ఆర్ధిక వ్వవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈ) ఆమోదించింది. దీని వల్ల దేశ వ్యాప్తంగా 3.7 లక్షల మంది జూట్ కార్మికులకు లబ్ధి చేకూరుతుంది. ఆహార ధాన్యాల్లో 90 శాతం, చక్కెరలో 20 శాతం జూట్ ప్యాకేజింగ్కు కేటాయించాలి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications