తప్పుడు పాలసీలు విక్రయిస్తే ఏజెంట్కు రూ. 10,000 జరిమానా
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అధారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏ) మంగళవారం నాడు ఇన్సూరెన్స్ ఏజెంట్లకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో ఇన్సూరెన్స్ ఏజెంట్లు నిబంధనలకు విరుద్ధంగా ఇన్సూరెన్స్ పాలసీలు విక్రయించారని తెలితే, ఇన్సూరెన్స్ కంపెనీకి రూ. కోటి వరకు జరిమానా విధిస్తామని తేల్చి చెప్పింది.
దీంతో పాటు ఏజెంట్కు కూడా రూ. 10,000 కూడా జరిమానా విధించినున్నట్లు మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇన్సూరెన్స్ ఏజెంట్లు నియామకం, పాటించాల్సిన విధానాలు, ఏజెంట్ ప్రవర్తనా నియమావళికి సంబంధించి ఐఆర్డీఏ మార్గదర్శకాలు జారీ చేసింది.
కొత్త నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఒక జీవిత ఇన్సూరెన్స్ సంస్ధ, సాధారణ ఇన్సూరెన్స్ సంస్ధ, ఆరోగ్య ఇన్సూరెన్స్ సంస్ధకు మించి ఎక్కువ సంస్ధలకు ఏజెంటుగా వ్వవహరించ లేరు. అన్ని ఇన్సూరెన్స్ సంస్ధల ఏజెంట్ల వివరాలతో జాబితా సిద్ధంగా ఉండాలి. ఒకే విధమైన ఉత్పత్తులు విక్రయించే ఒకటికి మించిన ఇన్సూరెన్స్ సంస్ధలకు ఏజెంట్గా ఉంటే, ఎక్కువ పాలసీలను విక్రయించగలుగుతారని పేర్కొంది.