అహ్మదాబాద్: ఉజ్వల గుజరాత్ సదస్సు రెండో రోజైన సోమవారం పెట్టుబడుల వరద పారింది. దేశీ విదేశీ కార్పొరేట్ సంస్థలు రూ.25 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 21 వేల ఎంవోయులు కుదుర్చుకున్నాయి. గత సదస్సుతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. 2013లో 17 వేల ఎంఒయులతో 12 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి.
ఇటీవల పశ్చిమ బెంగాల్లో నిర్వహించిన సదస్సులో కుదిరిన పెట్టుబడుల ప్రణాళికలతో పోలిస్తే ప్రస్తుత ఉజ్వల గుజరాత్ రెండోరోజు ప్రకటించిన పెట్టుబడులు పది రెట్లు అధికం. ఎంవోయులు ప్రకటించిన కంపెనీల్లో ఆర్ఐఎల్, బిర్లా గ్రూప్, అదానీ గ్రూప్, సుజ్లాన్, వీడియోకాన్ తదితర దిగ్గజాలున్నాయి. ఈ ప్రతిపాదనలు లక్షలాది ఉద్యోగాలను కల్పిస్తాయని అంచనా.
ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనడం ఈ సదస్సు అందరి దృష్టిని ఆకర్షించేందుకు దోహదం చేసిందని గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ అన్నారు. కొత్త ప్రభుత్వ చర్యలతో సమీప భవిష్యత్లో దేశంలోకి పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.

ఉజ్వల గుజరాత్
గత మూడునాలుగేళ్లుగా దేశం నుంచి విదేశాలకు జరుగుతున్న క్యాపిటల్ వలసకు అడ్డుకట్టవేసామన్నారు. ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడంపై (ఆర్డినెన్సుల జారీపై) ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అరుణ్ జైట్లీ చెప్పారు.

ఉజ్వల గుజరాత్
దేశంలో వ్యాపారనుకూల వాతావరణం పెంపొందిస్తామని ఆయన ఇన్వెస్టర్లకు హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధానిదే తుది నిర్ణయమని, మంచికైనా చెడుకైనా ఆయనే బాధ్యత వహిస్తారని జైట్లీ చెప్పారు.

ఉజ్వల గుజరాత్
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. మౌలికవసతుల కల్పన, ఉద్యోగ అవకాశాల పెంపు, అభివృద్ధిని పట్టాలెక్కించేందుకు తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు.

ఉజ్వల గుజరాత్
తమ చర్యలతో 3- 4 ఏళ్లుగా దేశ నుంచి జరుగుతున్న క్యాపిటల్ వలసను అరికట్టామన్నారు. తమ ప్రభుత్వం ఇబ్బందుల్లేని పన్ను వ్యవస్థను ఏర్పాటు చేయనుందని చెప్పారు.

ఉజ్వల గుజరాత్
రెట్రోస్పెక్టివ్ పన్ను విధానం మంచిదికాదని, ఆదాయాలు పెంచుకునేందుకు ఇటువంటి విధానాలను అవలంబించమని చెప్పారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications