న్యూఢిల్లీ/ముంబై: చెరకు రైతులను, చక్కెర మిల్లులను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర మంత్రుల బృందం చక్కెర పరిశ్రమకు తీపికబురును అందించింది. చెరకు రైతులకు బకాయిలను చెల్లించేందుకు గాను చక్కెర మిల్లులకు బ్యాంకుల నుంచి 7,200 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను అందించాలని ప్రధాని మన్మోహన్ సింగ్ నియమించిన మంత్రుల బృందం శుక్రవారం సిఫారసు చేసింది. ఈ సొమ్ము మొత్తాన్ని చెరకు పంటను తెచ్చి అమ్మే రైతులకు మిల్లుల యాజమాన్యాలు చెల్లించాలని మంత్రుల బృందం షరతు విధించింది.
చెల్లింపుల సంక్షోభంలో కూరుకుపోయిన చక్కెర మిల్లులకు తోడ్పాటునందించే ఉద్దేశంతో ఈ రుణాలను ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రుల కమిటీకి నేతృత్వం వహించిన వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ తెలిపారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోని రైతులకు మిల్లులు నిరుడు చెల్లించాల్సిన బకాయిలే రూ. 3,400 కోట్లు ఉన్నాయి. ప్రభుత్వ తాజా రుణ సాయంతో ఆర్థికంగా వెసులుబాటు లభిస్తుందని మిల్లుల యాజమాన్యాలు భావిస్తున్నాయి.

రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగా మిల్లుల రుణాల పునర్ వ్యవస్థీకరణ, 40 లక్షల టన్నుల వరకు ముడి చక్కెర ఉత్పత్తిపై ప్రోత్సాహకాలు, నిల్వ చేసుకోవటం, పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని ఐదు నుంచి పది శాతానికి పెంచటం వంటి కీలక సిఫారసులకు మంత్రుల బృందం అంగీకారం చెప్పింది. అయితే చక్కెరపై దిగుమతి సుంకాలను వెంటనే పెంచటం లేదని స్పష్టం చేసింది. చెరకు రైతుల బకాయిలను చెల్లించాలనే ఏకైక నిబంధనతో చక్కెర మిల్లులకు 7,200 కోట్ల రూపాయల రుణాలను అందించనున్నట్లు శరద్ పవార్ వెల్లడించారు.
చక్కెర పరిశ్రమను ఆదుకోవాలనే లక్ష్యంతో ఈ బెయిల్ ఔట్ ప్యాకేజీని ప్రకటించినట్లు శరద్ పవార్ చెప్పారు. మొత్తం 12 శాతం వడ్డీ రాయితీలో 7 శాతం షుగర్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డిఎఫ్) నుంచి కేటాయించనుండగా ప్రభుత్వం ఐదు శాతం చెల్లించనుందని ఆయన తెలిపారు. మొత్తం ఐదేళ్ల కాలంలో ఈ రుణాలను మిల్లులు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మొదటి రెండేళ్లు రుణాల చెల్లింపుపై మారటోరియం ఉండనుందని, మంత్రుల బృందం తీసుకున్న సిఫారసులన్నింటిని వచ్చే రెండు వారాల్లో కేబినెట్ ముందుంచనున్నట్లు పవార్ వెల్లడించారు.
చక్కెర పరిశ్రమను గట్టెక్కించటానికి మంత్రుల బృందం సిఫారసు చేసిన బెయిల్ ఔట్ ప్యాకేజీని భారత చక్కెర మిల్లుల సమాఖ్య (ఇస్మా) డైరెక్టర్ జనరల్ అభినాష్ శర్మ స్వాగతించారు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఈ రంగాన్ని ఆదుకోవటానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తోడ్పాడునందించేవిగా ఉన్నాయని అన్నారు.
కాగా మంత్రుల బృందం సిఫారసులతో స్టాక్ మార్కెట్లలో చక్కెర కంపెనీ షేర్లు దూసుకుపోయాయి. బిఎస్ఈలో శక్తి షుగర్స్ షేర్లు ఏకంగా 10.39 శాతం పెరగగా బజాజ్ హిందుస్తాన్ షేర్లు 5.46 శాతం పెరగగా, ద్వారకేష్ షుగర్స్ 4.96 శాతం, మవానా షుగర్ 4.98 శాతం, ధర్మపూర్ షుగర్ 4.96 శాతం, రేణుకా షుగర్స్ 4.27 శాతం, బలరాంపూర్ చినీ 2.56 శాతం మేర లాభపడ్డాయి.
స్వల్ప లాభాల్లో మార్కెట్లు
వారాంతం రోజు కూడా మార్కెట్కు ఒడిదుడుకులు తప్ప లేదు. ప్రారంభం నుంచే లాభ, నష్టాలతో కొనసాగిన సూచీలు చివరకు లాభాల్లోనే ముగిశాయి. ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి వ్యవహరించడమే ఒడిదుడుకులకు కారణమని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. బిఎస్ఈ సూచీ 38.72 పాయింట్లు పెరిగి 20,996.53 వద్ద, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 18.80 పాయింట్లు వృద్ధి చెంది 6,259.90 వద్ద నిలిచాయి. ప్రభుత్వరంగ సంస్థలతోపాటు కన్జ్యూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్, మెటల్, బ్యాంకింగ్రంగ షేర్లు మదుపర్లను అమితంగా ఆకట్టుకున్నాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications