ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటాను కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం ప్రశంసలతో ముంచెత్తారు. భారత కార్పొరేట్ రంగానికి ఆయన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ లాంటి వారని కొనియాడారు. పారిశ్రామిక రంగానికి, సమాజానికి అందించిన విశేష సేవలకుగానూ శుక్రవారం ముంబైలో జరిగిన సిఐఐ జాతీయ మండలి సమావేశాల్లో రతన్ టాటాను తొలి సిఐఐ ప్రెసిడెంట్స్ అవార్డుతో చిదంబరం సత్కరించారు.
రతన్ టాటా ఈ అవార్డుకు తగినవారని చిదంబరం అన్నారు. దేశంలో లక్షలాదిగా, విదేశాల్లో వేలాదిగా ఉద్యోగవకాశాలు కల్పించిన ఆయనను మనస్పూర్తిగా మెచ్చుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ చివరి మ్యాచ్ ఆడుతున్న వాంఖేడే స్టేడియం ఇక్కడికి సమీపంలోనే ఉందని, అయినా ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కార్పొరేట్లు హజరయ్యారని అన్నారు. క్రికెట్లో సచిన్కు ఉన్నంత ఆదరణ పారిశ్రామిక రంగంలో రతన్ టాటాకు ఉందని ఆయన అన్నారు. ఆయన లాంటి వ్యక్తి పదవి విరమణ చేయకూడదని, కొత్త కొత్త విషయాలు ఆలోచించి అమలు చేయాలని చిదంబరం కోరారు.

ఈ సందర్భంగా రతన్ టాటా మాట్లాడుతూ.. దేశ నిర్మాణంలో పరిశ్రమల పాత్రను ముఖ్యమైనదని అన్నారు. నా ఆశయాన్ని నెరవేర్చుకున్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు. భాగస్వాముల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ తన నిర్ణయాన్ని మార్చుకోని రతన్ టాటా.. గత ఏడాది డిసెంబర్ 28న టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్న విషయం తెలిసిందే. వ్యాపార సామ్రాజ్యంలో అన్ని రంగాల్లో విస్తరించిన టాటా గ్రూప్ పాత్ర మరువలేనిదని చిదంబరం అన్నారు.
ఒఎన్జిసి చీఫ్ సుధీర్ వాసుదేవ, సిఐఐ అధ్యక్షులు క్రిస్ గోపాలక్రిష్ణన్, ఐటిసి అధినేత వైసి దేవేశ్వర్, విప్రో అధినేత అజీమ్ ప్రేమ్జీ, రాహుల్ బజాజ్, ఆడీ గోద్రేజ్, రామదొరై కూడా రతన్ టాటాను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెప్సికో చైర్పర్సన్, సిఇఒ ఇంద్రానూయి పాల్గొన్నారు. ప్రతి నిర్ణయం చెడు ఉద్దేశంతో, ఉద్దేశపూర్వకంగా తీసుకున్న నిర్ణయంగా భావిస్తే.. వ్యాపార సంస్థలు మనుగడ సాగించలేవని, అటువంటి పని చేయొద్దని దర్యాప్తు సంస్థలకు ఈ సందర్భంగా చిదంబరం సూచించారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications