ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను పెంచిన కెనరా బ్యాంక్
కెనరా బ్యాంకుతో పాటు మరో మూడు బ్యాంకులు తమ వడ్డీ రేట్లలో మార్పులు చేశాయి. వీటిలో యాక్సిస్, కరూర్ వైశ్యా, దేనా బ్యాంకులు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుసరిస్తున్న కఠిన లిక్విడీటీ పరిస్దితుల నేపథ్యంలో చాలా బ్యాంకులు ద్రవ్య లభ్యతను పెంచుకోవాలనే ఆలోచనలో ఉన్నాయి. ఇందులో భాగంగానే డిపాజిట్ రేట్లు, రుణ రేట్లను పెంచుతున్నాయి.
యాక్సిస్ బ్యాంక్: ప్రైవేట్ రంగంలో అతి పెద్ద బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్ కనీస రుణ రేటును పావు శాతం పెంచింది. దీనితో ఈ రేటు 10.25 శాతానికి ఎగిసింది. ఈ తాజా రేటు ఆగస్టు 19 నుండి అమల్లోకి వచ్చినట్లు బ్యాంక్ తెలిపింది. ఈ తాజా నిర్ణయంతో కనీస రేటుకు అనుసంధానమైన గృహ, ఆటో, కార్పోరేట్ రుణ రేట్లు పెరగనున్నాయి.
కరూర్ వైశ్యా బ్యాంక్: ప్రైవేటు రంగంలోని కరూర్ వైశ్యా బ్యాంక్ రుణ రేటును ఈరోజు పావుశాతం పెంచుతోంది. దీంతో ఈ రుణ రేటు 11 శాతానికి చేరనుంది. ప్రాధమిక వడ్డీ రేటును కూడా 15.75 శాతం నుండి 16 శాతానికి పెంచింది.
దేనా బ్యాంక్: దేనా బ్యాంక్ మూడేళ్లకు పైబడిన ఎన్ఆర్ఐ డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఒక శాతానికి పెంచింది.
వన్ఇండియా మనీ తెలుగు