వోడాఫోన్ ఇండియాకు కేంద్ర టెలికాం శాఖ రూ. 100 కోట్ల జరిమానా

Vodafone India
న్యూఢిల్లీ: 2003 నుండి 2005 మధ్య ఎస్టీడీ సర్వీసులను లోకల్ సర్వీసులుగా మార్చినందుకు గాను కేంద్ర టెలికాం శాఖ వోడాఫోన్ ఇండియాకు రూ. 100 కోట్ల జరిమానా విధించింది. సబ్ స్కైబర్ లోకల్ డైలింగ్ (SLD) అంటే వినియోగదారులు స్దానిక నెట్ వర్క్‌లో సంచరించేటప్పుడు.. రోమింగ్ మరియు ఎస్టీడీ ఆరోపణలు ఎగవేయడానికి అనుమతించే ఒక సౌకర్యం. సరిగ్గా ఇదే ఆరోపణలపై మే నెల్లో 30వ తారీఖున భారతీ ఎయిర్ టెల్‌పై కూడా కేంద్ర టెలికాం శాఖ జరిమానా విధించిన విషయం తెలిసిందే.

కేంద్ర టెలికాం శాఖ అందించిన సమాచారం ప్రకారం భారతీ ఎయిర్ టెల్‌కు 13 రీజియన్లలో సబ్ స్కైబర్ లోకల్ డైలింగ్ నిబంధనను ఉల్లంఘించడం వల్ల రూ. 650 కోట్లు జరిమానా విధించగా.. వోడాఫోన్ ఇండియాకు మాత్రం ముంబై, న్యూఢిల్లీ రీజియన్లలో నిబంధనను ఉల్లంఘించడం వల్ల రీజియన్‌కు రూ. 50 కోట్లు చొప్పున మొత్తంగా రూ. 100 కోట్ల జరిమానా విధించింది. జూన్ 2003లోనే సబ్ స్కైబర్ లోకల్ డైలింగ్ సర్వీసుని నిలిపివేయాలని టెలికాం శాఖ ప్రస్తావించినప్పటికీ.. హాచ్ (ఇప్పుడు వోడాఫోన్) మాత్రం జాతీయ రౌటింగ్ ప్రణాళికను అతిక్రమించి 2005 వరకూ ఈ సేవలను కొనసాగించడం వల్ల ఈ జరిమానా విధించారు.

ఈ విషయంపై కేంద్ర టెలికాం మంత్రి కపిల్ సిబల్ వోడాఫోన్ ఇండియా, భారతీ ఎయిర్ టెల్‌కు షోకాజ్ నోటీసులు పంపించినప్పటికీ.. వోడాఫోన్ ఏ మాత్రం స్పందించ లేదు. ఐతే వోడాఫోన్ అధికార ప్రతినిధి మాత్రం దీనిని కొట్టి పారేశారు. ఇది ఇలా ఉంటే వొడాఫోన్‌ ఇండియా, భారతీ ఎయిర్‌టెల్‌ రెండూ కూడా వేర్వేరు కారణాల వల్ల తీవ్రమైన సమస్యల్ని ఎదుర్కొంటున్నాయి. వొడాఫోన్‌ దాదాపు 12 వేల కోట్ల రూపాయల ట్యాక్స్‌ చెల్లించాలని ఐటీ శాఖ గట్టిగా పట్టుపడుతోంది. దీనిపై కోర్టు బయట సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకునేందుకు ఇటీవల కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

వన్ఇండియా మనీ తెలుగు

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+