For Quick Alerts
For Daily Alerts
నాగ్పూర్లో 1,000 సీట్ల సామర్థ్యంతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్: మహీంద్రా సత్యం
|
వచ్చే 15-18 నెలల్లో నాగ్పూర్లోని మిహాన్ క్యాంపస్లో తొలి దశ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది. ఇకపోతే ఒడిశా రాజధాని భువనేశ్వర్ క్యాంపస్ విస్తరణ ప్రణాళిక కూడా ఇందులో భాగంగా ఉందని తెలిపింది. గ్లోబల్ డెలివరీ మోడల్ను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించడంలో భాగంగానే ప్రస్తుత ప్రణాళిక ఉంటుందని, ‘2015 మిషన్' కూడా ఇదేనని మహీంద్రా సత్యం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (కమర్షియల్ అండ్ కార్పొరేట్ సర్వీసెస్) శివానంద రాజా పేర్కొన్నారు. తద్వారా ఆయా నగరాల్లో ఉపాధి కల్పనతో పాటు నవకల్పనల్లో వేగాన్ని పెంచగలమని ఆయన చెప్పారు. నాగ్పూర్లో 4,354 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న మల్టీ-మోడల్ ఇంటర్నేషనల్ కార్గో హబ్ అండ్ ఎయిర్పోర్ట్ (మిహాన్) ఎస్ఈజెడ్లో క్యాంపస్లో బాగుంటుందని కంపెనీ భావిస్తోంది.
తెలుగు వన్ఇండియా
Comments
English summary