ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) స్కీం నిధుల కోసం తెలంగాణ రాష్ట్రంలో 145 లక్షల మందికి పైగా రైతులు వేచి చూస్తున్నారు. అక్టోబర్ నెల నుంచి ఈ నెలాఖరు వరకు 36 లక్షలమంది రైతుల ఖాతాల్లో రూ.2వేల చొప్పున జమ చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికి 22 లక్షలమంది రైతుల ఖాతాల్లో మాత్రమే ఈ మొత్తం జమైంది. మరో 14 లక్షల మంది రైతుల్లో ఆరు లక్షలమంది పేర్లు, బ్యాంకుల అకౌంట్ వివరాల్లో తప్పులు ఉన్నందున సరి చేస్తున్నారు. కొద్ద్ి రోజుల్లో వీరి అకౌంట్లలో డబ్బులు పడనున్నాయి.

అందుకే అందరి అకౌంట్లలో డబ్బులు జమ కాలేదు
తప్పులు సవరించి కేంద్రానికి పంపించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇవి అందితే నెలాఖరులోగా మిగిలిన వారి ఖాతాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నాలుగు విడతలు పీఎం కిసాన్ నిధులు రైతులకు అందాయి. మొదటి విడతలో తెలంగాణలో 34 లక్షలమందికి పైగా ఖాతాల్లో జమయ్యాయి. మిగిలిన మూడు విడత్లలో అందరికీ జమ కాలేదు. పేర్లు, బ్యాంకు అకౌంట్లు తప్పుగా ఉండటం వంటి వివిధ కారణాలతో జమ కాలేదు.

36 లక్షల మందికి పైగా లబ్ధిదారులు
ఈ ఏడాది జూలై నుంచి ఈ పథకం పరిధిలోకి భూయజమానులంతా రావడంతో మొత్తం అర్హుల సంఖ్య 36 లక్షలకు చేరుకుంది. ఈ పథకం కింద మోడీ ప్రభుత్వం మొత్తం రూ.6వేలు రైతులకు ఇస్తుంది. వీటిని రూ.2వేల చొప్పున మూడు విడతల్లో ఇస్తుంది. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. కుటుంబంలో ఎవరి పేరుతో ఎక్కువ భూమి ఉంటే వారి బ్యాంకు అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి.

ఏపీ, తెలంగాణల్లో లబ్ధిదారులు.. ఎంతమందికి నిధులు వచ్చాయంటే?
పీఎం కిసాన్ వెబ్ సైట్ ప్రకారం తెలంగాణలో లబ్ధిదారులు 34,80,677 కాగా, మొదటి విడతలో 34,61,375, రెండో విడతలో 33,50,634, మూడో విడతలో 30,83,407, నాలుగో విడతలో 22,01,068 మంది అకౌంట్లలో పెట్టుబడి సాయం క్రెడిట్ అయింది. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 50,76,623 లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో మొదటి విడతలో 43,61,220, రెండో విడతలో 41,30,410, మూడో విడతలో 33,60,204 అందాయి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications