కరోనా మహమ్మారి కారణంగా చితికిపోయిన భారత్లోని 15 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి కంపెనీ(MSME)లకు ద్రవ్య లభ్యత లభించేందుకు 750 మిలియన్ డాలర్లు/రూ.5,670 కోట్లకు పైగా బడ్జెట్ సహకారం అందిస్తామని ప్రపంచ బ్యాంకు బుధవారం తెలిపింది. కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. అన్ని దేశాల్లో డిమాండ్ పడిపోయి ఉత్పత్తి నిలిచిపోయి, లాక్ డౌన్ తర్వాత కూడా డిమాండ్ లేమి కారణంగా ఎంఎస్ఎంఈలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వీటికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ.4 లక్షల కోట్ల వరకు సహాయం ప్రకటించింది.

ప్రపంచ బ్యాంకు భారీ సాయం
ఇప్పుడు ప్రపంచ బ్యాంకు రూ.5,670 కోట్ల వరకు బడ్జెట్ సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది. కరోనా ప్రభావం నుండి బయట పడేందుకు ఎంఎస్ఎంఈలకు రూ.3.7 లక్షలకు పైగా రుణ ప్రణాళికను ప్రకటించడంపై ప్రపంచ బ్యాంకు హర్షం వ్యక్తం చేసింది. బ్యాంకులు, సిడ్బీ ద్వారా కూడా వ్యవస్థలోకి నగదును చొప్పించేందుకు ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) చేపట్టిన చర్యలను ప్రశంసించింది. ఈ మేరకు ప్రపంచ బ్యాంకు భారత డైరెక్టర్ జునైద్ అహ్మత్ కితాబిచ్చారు.

ప్రభుత్వంతో కలిసి..
కరోనా నేపథ్యంలో భారత సామాజిక, వైద్య రంగాలకు ప్రపంచ బ్యాంకు ఇప్పటికే 2.75 బిలియన్ డాలర్ల ఫండింగ్ ప్రకటించింది. మన కరెన్సీలో రూ.20 వేల కోట్లకు పైగా. వీటికి అదనంగా ప్రస్తుతం ప్రకటించిన మొత్తాన్ని ఎంఎస్ఎంఈల కోసం ఇస్తామని ప్రపంచ బ్యాంకు తెలిపింది. డెవలప్మెంట్ పాలసీ లోన్ కింద కేటాయించే నిధులను, ప్రత్యేకంగా ఏ వ్యయానికి కేటాయించడం లేదని, ప్రభుత్వంతో కలిసి అవసరమైన సహకారం కోసం ఉంటుందన్నారు.

ద్రవ్య సామర్త్యం పెరుగుతుంది
ఎంఎస్ఎంఈల కోసం కేటాయించే మొత్తం (ప్రపంచ బ్యాంకు ఫండ్) ద్వారా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (SFBs), నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCs)కు ద్రవ్య సామర్థ్యం పెరుగుతుందన్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు, లక్షలాది ఉద్యోగాలను కాపాడేందుకు ఈ కార్యక్రమం 15 లక్షల ఎంఎస్ఎంఈలకు ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. ఈ లోన్ మెచ్యూరిటీ 19 ఏళ్లతో 5 ఏళ్ల గ్రేస్ పీరియడ్ కలిగి ఉంటుందని చెప్పారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications