ఎంఎస్ఎంఈ కార్మికులు, వలస కూలీలు కరోనా మహమ్మారి కారణంగా భారీగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో కనీసం వారికి ప్రారంభ దశలోనైనా అండగా నిలిచేందుకు రూ.75,000 కోట్ల మూలధనంతో మహమ్మారి రిస్క్ నిధిని ఏర్పాటు చేయాలని ఐఆర్డీఐఏ కార్యాచరణ బృందం ఒకటి సిఫార్సు చేసింది. దీని కింద రూ.75,000 కోట్లతో ప్రభుత్వం నుండి మద్దతు హామీని పొందాలని తెలిపింది. నిధి పరిమాణం అనేది ఎంత మేర నష్టాన్ని పూడ్చాలన్న అంచనాలపై ఆధారపడి ఉంటుందని ఆ బృందం తన నివేదికలో తెలిపింది. ఇండియన్ పాండమిక్ రిస్క్ పూల్ ద్వారా అసంఘటిత, అల్పాదాయ వర్గాలకు ఎదురైన నష్టాలను పూడ్చాలని తెలిపింది.
భవిష్యత్తులో సమాజంపై తీవ్రప్రభావం చూపే ఈ తరహా మహమ్మారి ఏర్పడిన సమయంలో ఉద్యోగాలు కోల్పోయే అసంఘటిత, అల్పాదాయవర్గ కార్మికులకు అండగా నిలిచేందుకు ఈ నిధి ఉపయోగకారిగా ఉంటుందని తెలిపింది. కరోనా వల్ల వ్యాపార అంతరాయ నష్టాలు భారీగా ఉన్నాయని, వాటి అంచనా క్లిష్టంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. తొలి దశ పాండమిక్ రిస్క్ పూల్లో భాగంగా ఎంఎస్ఎంఈ రంగ వేతనాలు, వలస కార్మికులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఈ నివేదిక వెల్లడించింది.

ఈ క్లిష్ట పరిస్థితుల్లో సాధారణంగా నాలుగు కోట్ల ఉద్యోగాలు, కార్మికులకు గరిష్టంగా మూడు నెలల వేతనాలు ప్రయోజనం లెక్కన, రూ.6,500 రీయింబర్స్మెంట్స్ చొప్పున వీరికి మొత్తం రూ.78,000 కోట్లు చెల్లించాలని తెలిపింది. ఇటీవల ఇండియన్ న్యూక్లియర్ ఇన్సురెన్స్ పూల్ను పరిగణలోకి తీసుకొని రూ.5000 కోట్లతో నిధి ఏర్పాటు చేయాలని సిఫార్సు చేస్తున్నామని, మిగతా రూ.75 వేల కోట్లు ప్రభుత్వం నుండి బ్యాక్ స్టాఫ్ గ్యారెంటీగా రావాలని స్పష్టం చేసింది. తర్వాత మిగతా వ్యాపారాలకూ ఈ కవరేజీని పెంచుకుంటూ వెళ్లాలని తెలిపింది. బ్యాక్స్టాఫ్ గ్యారెంటీని రూ.75వేలకోట్ల నుండి క్రమంగా రూ.1,23,000 కోట్ల వరకు పెంచుకోవాలని సూచించింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications