మధ్య తరగతి భక్తులకు భారం: తిరుమలలో గదుల ధర రెండింతలు, ఏది ఎంత అంటే?
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి... ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన దేవుడు. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు. రోజు కూడా కోట్లాది మంది విరాళాలు సమర్పిస్తారు. తిరుమలలో మధ్యతరగతి భక్తులకు వసతి గదులు దొరుకతాయి. ఈ ధరలను తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవల పెంచింది. పెంచిన ధరలు గత గురువారం నుంచి అమలులోకి తెచ్చింది.
ఆ ఉద్యోగులకు జగన్ శుభవార్త, వేతనం ఏకంగా రెండింతలు పెంపు
రెండింతలు పెరిగిన ధరలు
పెంచిన ధరలను ఆన్ లైన్, ఆఫ్ లైన్లలో అమలులోకి తీసుకు వచ్చింది. కౌస్తుభం, పాంచజన్యం సముదాయాల్లో గది అద్దెను రూ.500 నుంచి రూ.1000కి పెంచింది. నందకంలో గదులను రూ.600 నుంచి రూ.1000కు పెంచింది. ధరలు పెంచిన వెంటనే అమలులోకి వచ్చాయి. దీంతో ముందస్తు సమాచారం లేకపోవడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు.
యథావిధిగా రూ.50, రూ.100 ధరలు
ఈ నెల 5వ తేదీన గదుల బుకింగ్కు ఆన్ లైన్ కోటా విడుదల చేసింది. ఇందులో పెంచిన ధరలు ఉన్నాయి. తొలుత కరెంట్ కౌంటర్ల వద్ద భక్తులు గదులు బుక్ చేసుకున్నారు. రూ.1000గా చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారు. అదనపు సౌకర్యాలు కల్పించకుండా ధరలు పెంచడంపై భక్తులు అసహనం వ్యక్తం చేశారు. రూ.50, రూ.100 గదులు అధునికీకరించి వాటి ధరలు పెంచే యోచనలో ఉన్నట్లు చెప్పారు. కానీ ఈ ధరలు ప్రస్తుతం పెంచలేదు.
ఆఫ్ లైన్.. ఆన్ లైన్
తిరుమలలో రూ.50 నుంచి రూ.3,000 వరకు ఉన్న గదులు వివిధ సౌకర్యాలతో అందుబాటులో ఉన్నాయి. ఆన్ లైన్ ద్వారా రూ.100, రూ.500, రూ.600, రూ.999, రూ.1500 అందుబాటులో ఉన్నాయి.
వారికి ఇక భారం..
తిరుమలకు వెళ్లే భక్తుల్లో ఎక్కువగా రూ.100 గదులను తీసుకుంటారు. రూ.100 గదులు పూర్తిగా నిండితే రూ.500, రూ.600 గదులను తీసుకుంటారు. ఇవి మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతికి అందుబాటులో ఉండేవి. ఇప్పుడు వీటి ధరలు పెరగడం భక్తులకు ఇబ్బందికరం.
తిరుపతిలో ధరలు యథాతథం
తిరుమలలో అకామిడేషన్ ధరలు పెరిగినప్పటికీ, తిరుపతిలోని శ్రీనివాసంలో మాత్రం ధరలు యథావిధిగా ఉన్నాయి. గది రూ.200, ఏసీ గది రూ.400, డీలక్స్ ఏసీ గది రూ.600, మాధవమ్ ఏసీ రూ.800, డీలక్స్ ఏసీ రూ.1000గా ఉంది.