For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఛార్జింగ్ స్టేషన్స్ ఉపయోగిస్తున్నారా..ఆలోచించండి, మీ డబ్బు దొంగిలించొచ్చు!: కస్టమర్లకు SBI

|

ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ కస్టమర్లను హెచ్చరించింది. ఫ్రాడ్ చేసే వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని బ్యాంకులు ఎప్పటికప్పుడు తమ వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేస్తుంటాయి. తాజాగా, ఎస్బీఐ మరోసారి కస్టమర్లను ప్రాడ్‌స్టర్స్ నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేసింది. వివిధ పబ్లిక్ ప్రాంతాల్లోని ఛార్జింగ్ స్టేషన్స్ వద్ద తమ ఫోన్స్‌ను పెట్టినప్పుడు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

గుడ్‌న్యూస్: డబ్బుల్లేకుండా వస్తువులు కొనొచ్చు,క్యాష్ బ్యాక్గుడ్‌న్యూస్: డబ్బుల్లేకుండా వస్తువులు కొనొచ్చు,క్యాష్ బ్యాక్

ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి

ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి

ఛార్జింగ్ స్టేషన్లలో మీ ఫోన్‌ను ప్లగ్ చేయడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండని, మాల్వేర్ మీ ఫోన్లో ఓ మార్గాన్ని గుర్తించి వచ్చే ప్రమాదముందని, మీ పాస్ వర్డ్‌ను దొంగిలించేందుకు ఆస్కారం ఉందని, అలాగే ఇతర డేటాను కూడా చోరీ చేసే అవకాశాలు ఉన్నాయని ఎస్బీఐ తన ట్వీట్‌లో పేర్కొంది.

డేటాను ఇలా దొంగిలిస్తున్నారు

డేటాను ఇలా దొంగిలిస్తున్నారు

మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లలో జరుగుతున్న ఆన్ లైన్ మోసం గురించి ఎస్బీఐ తన కస్టమర్లను హెచ్చరించింది. మీ స్మార్ట్ ఫోన్ ఓనర్స్ పాస్ వర్డ్స్, ఇతర ముఖ్యమైన డేటాను చోరీ చేసే ఆస్కారం ఉంటుందని సూచించింది. ఆన్ లైన్ మోసగాళ్లు ఇటీవలి కాలంలో మొబైల్ ఛార్జింగ్ పాయింట్ వెనుక భాగంలో ఆటో డేటా ట్రాన్సుఫర్ డివైజ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో స్మార్ట్ ఫోన్ ప్లగిన్ చేసినప్పుడు ఆ డేటాను ఆ డేటా ట్రాన్సుఫర్ డివైజ్ ద్వారా దొంగిలిస్తున్నారు.

పాపప్ చూడకుండానే..

పాపప్ చూడకుండానే..

స్కిమ్మింగ్ కార్డు ఉంటే మీ మొబైల్ కనెక్ట్ చేసిన తర్వాత మీకు పాపప్ వస్తుంది. కానీ చాలామంది దానిని చదవకుండానే యస్ అనే బటన్ పైన క్లిక్ చేస్తారు. దానిని చూసుకోకుండే మీ ఫోన్ నుంచి పాస్ వర్డ్స్, ఇతర డేటా దొంగిలించడం సులభమవుతుంది.

పాపప్ చూసుకొని..

పాపప్ చూసుకొని..

మీరు ఛార్జింగ్ కేబుల్‌తో ప్లగిన్ చేస్తే పాపప్ రాదు. పాపప్ లేదంటే కొంత సమస్య ఉందని అర్థం. అలాంటి సందర్భంలో మొబైల్ ఛార్జింగ్ స్టేషన్ల నుంచి మీ మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేయకుండా ఉండటం మంచిది.

వీటిని అందుకే గుర్తించలేకపోతున్నారు

వీటిని అందుకే గుర్తించలేకపోతున్నారు

మీ డేటా దొంగిలించేందుకు ఆన్ లైన్ ఫ్రాడ్‌స్టర్స్ ఉపయోగించే డివైజ్‌ను ఆన్ లైన్ వెబ్ సైట్స్ ద్వారా కొనుగోలు చేస్తారు. ఇవి చైనా నుంచి దిగుమతి అవుతాయి. ఇది అచ్చు పెన్ డ్రైవ్ లాగా ఉంటుంది. కాబట్టి కస్టమ్స్ స్టాఫ్‌కు ఈ మోసాలను గుర్తించడం కష్టతరంగా మారిందని చెబుతున్నారు.

ఇవి అనుసరించండి

ఇవి అనుసరించండి

- ఛార్జింగ్ స్టేషన్ వెనుక ఉన్న ఎలక్ట్రికల్ సాకెట్‌ను పరీక్షించండి.

- మీ సొంత ఛార్జింగ్ కేబుల్స్ తీసుకెళ్లండి

- ఎలక్ట్రికల్ ఔట్ లెట్ నుంచి నేరుగా ఛార్జింగ్ చేసుకోండి.

- తెలిసిన వెండర్స్ నుంచి పోర్టబుల్ బ్యాటరీలు కొనుగోలు చేయండి

English summary

ఛార్జింగ్ స్టేషన్స్ ఉపయోగిస్తున్నారా..ఆలోచించండి, మీ డబ్బు దొంగిలించొచ్చు!: కస్టమర్లకు SBI | SBI alert: Think Twice Before You Plug in Your Phone at Charging Stations

The State Bank of India has warned its customers against plugging in their phone at charging stations at various public places. The Bank has apprised its account holders of Malwarebytes (present at the charging points), which could infect their smartphone, giving online fraudsters a chance to rob off their important data and passwords including highly confidential bank details.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X