న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు. బడ్జెట్ సమావేశాలు నేటి (జనవరి 31) నుంచి ప్రారంభమై జనవరి 3 వరకు కొనసాగుతాయి. బడ్జెట్కు ముందు.. ఈ రోజు ఆర్థిక సర్వేను సమర్పిస్తారు. 15వ ఆర్థిక సంఘం తాత్కాలికంగా నివేదికు కూడా ఈ సమావేశాల్లో సభ ముందు ఉంచవచ్చు. ఏప్రిల్ 1, 2020 నుంచి ఈ ఆర్థిక సంఘం సిఫార్సులు అమలులోకి రావాల్సి ఉండగా, కాలపరిమితిని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి మాత్రమే ఇచ్చి తాత్కాలిక నివేదికను సభ ముందు ఉంచి ఆమోదం తీసుకోనుంది. ఆర్థిక సంఘం నివేదికతో పాటు ఆర్థిక సర్వేను (ఎనకమిక్ సర్వే) ప్రవేశ పెడుతారు. మరి ఆర్థిక సర్వే అంటే...
బడ్జెట్కు సంబంధించిన మరిన్ని కథనాలు

ఏమిటీ ఆర్థిక సర్వే?
బడ్జెట్కు ఒక రోజు ముందు వెల్లడయ్యే ఆర్థిక సర్వేకు ఎంతో ప్రాధాన్యత. గడిచిన ఏడాది కాలానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితిని వెల్లడిస్తుంది. సవాళ్లు, పరిష్కారాలకు సంబంధించిన నివేదిక ఇది. వ్యవస్థలోని వివిధ రంగాల పరిస్థితిని ఇది తెలుపుతుంది. దీని ద్వారా మొత్తం ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో వెల్లడవుతుంది. అలాగే, ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలు పట్టేందుకు చేయాల్సిన విధాన మార్పులతో పాటు ప్రభుత్వం ఏం చేయాలో సూచిస్తుంది.

కచ్చితంగా పాటించాలని లేదు..
చీఫ్ ఎకనమిక్స్ అడ్వైజర్ (CEA) ఆర్థిక సర్వేను రిలీజ్ చేస్తారు. ప్రభుత్వ పథకాలపై CEA అభిప్రాయాలను, వృద్ధికి అవసరమైన చర్యలను ఇందులో పొందుపరుస్తారు. అయితే ఈ సిఫార్సులను అనుసరించాలనే నిబంధన లేదు. వివిధ ఆర్థిక సర్వేల్లోని సూచనలు ఆయా బడ్జెట్లలో పాటించలేదు.

రెండు భాగాలుగా...
ఎకనమిక్ సర్వే రెండు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగంలో కీలక అంశాలపై CEA అభిప్రాయాలు, సమస్యలకు పరిష్కారాలుంటాయి. ఆర్థిక వ్యవస్థపై సమీక్ష ఉంటుంది. ఇక రెండో భాగంలో మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాలు ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై ఇచ్చిన గణాంకాలు ఉంటాయి. వీటిని అన్నింటిని CEA అభిప్రాయాలకు అనుగుణంగా తయారు చేసుకోవచ్చు.

ప్రజలకు ఆర్థిక పరిస్థితి, విధానాలపై అవగాహన
ఎకనమిక్ సర్వే లేదా ఆర్థిక సర్వే వెల్లడి ద్వారా దేశ ప్రజలకు ఆర్థిక విధానాలపై అవగాహన వస్తుంది.

ఎకనమిక్ సర్వేను ఎవరు తయారు చేస్తారు?
ఆర్థిక సర్వేను CEA, ఆయన బృందం తయారు చేస్తుంది. పార్లమెంటు ఉభయ సభల్లో బడ్జెట్కు ముందు రోజు దీనిని ప్రవేశ పెడతారు. CEA డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణియన్ నేతృత్వంలోని ఎకనమిక్ డివిజన్ ఆఫ్ ది డిపార్టుమెంట్ ఆఫ్ ఎకనమిక్ అఫైర్స్ దీనిని సిద్ధం చేస్తుంది. దీనిని సిద్ధం చేశాక ఆర్థికమంత్రి అప్రూవల్ తీసుకుంటారు.

1964 తర్వాత విభజించి..
1950-51లో తొలిసారిగా ఆర్థిక సర్వేను తీసుకు వచ్చారు. 1964 వరకు దీనిని బడ్జెట్తో పాటు ప్రవేశ పెట్టినప్పటికీ, ఆ తర్వాత విభజించారు. గత కొన్నేళ్లుగా ఎకనమిక్ సర్వేను రెండు విభాగాలుగా తీసుకు వస్తున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications