సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఇండియాకు వచ్చి ఎంతో కాలమైంది. ఇలాంటి దిగ్గజ సంస్థ భారత్లో తన మొదటి పెట్టుబడిని మీషో (Meesho)లో పెట్టింది. ఫేస్బుక్కు 25 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. వారిని వినియోగదారులుగా చేసుకొని సరికొత్త ఆన్లైన్ వ్యాపారాన్ని నిర్వహించేందుకు 'మీషో'తో ముందుకు వస్తోంది. మేరీ షాప్ అనే హిందీ అర్థానికి లేదా మై షాప్ అనే పదానికి... సంక్షిప్తరూపమే 'మీషో'.
ఫేస్బుక్ 'మీషో'లో రూ.5 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లుగా తెలుస్తోంది. కానీ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. గత ఏడాది నాటికే 'మీషో' 25 కోట్ల డాలర్ల పెట్టుబడులను సమీకరించింది. ఇందులో ఫేస్బుక్తో పాటు మరిన్ని సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. ఢిల్లీలోని ఐఐటీలో 2008-2012 బ్యాచ్మేట్స్ 27 ఏళ్ల విదిత్ ఆత్రే, 28 ఏళ్ల సంజీవ్ బార్వల్ బెంగళూరుకు కేంద్రంగా 'మీషో' స్టార్టప్ను 2015లో స్థాపించారు. పెద్ద పెద్ద మాల్స్ ద్వారా ఆన్లైన్ వ్యాపారాన్ని నిర్వహించిన అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలు ఇప్పుడు చిల్లర వ్యాపారులతో జతకడుతున్నాయి.

చిల్లర వ్యాపారులు తమ వస్తువులను ఈ సంస్థల ద్వారా విక్రయించవచ్చు. అయితే వారికి ప్రత్యేకమైన నెట్ వర్క్ గానీ, యాప్ గానీ లేదు. వారందరినీ ఓ నెట్ వర్క్ పరిదిలోకి తెస్తే, సోషల్ మీడియాకు వారిని లింక్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనకు ప్రతిరూపమే 'మీషో'. చిల్లర వ్యాపారులు తమ కొత్త ఉత్పత్తులకు సంబంధించి వాణిజ్య ప్రకటలను ఫేస్బుక్లో షేర్ చేసుకునే అవకాశం ఉంది. 'మీషో'లో మైనార్టీ స్టేక్ ఇన్వెస్ట్ చేస్తున్నట్లు జూన్ 13న ఫేస్బుక్ ప్రకటించింది.
More From GoodReturns

ఇరాన్ యుధ్ధం.. హార్ముజ్ జలసంధిని దాటిన రెండు భారత ఎల్పీజీ నౌకలు.. ఎలా సాధ్యమయిందంటే..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications