న్యూఢిల్లీ: చమురు ధరలు వరుసగా నాలుగు రోజులు పెరిగాయి. పెట్రోల్ లీటర్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ.88 మార్కును దాటింది. నేడు పెట్రోల్ ధరలు వివిధ నగరాల్లో 26 పైసల నుండి 29 పైసల మధ్య, డీజిల్ ధరలు 34 పైసల నుండి 38 పైసల మధ్య పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతుండటంతో ఈ ప్రభావం దేశీయ ఇంధన ధరలపై పడుతోంది. ఫిబ్రవరి నెలలో ఈ 12 రోజుల కాలంలో లీటర్ పెట్రోల్ పైన రూ.4.13, లీటర్ డీజిల్ పైన రూ.4.26 పెరిగింది. గత 11 నెలల కాలంలో రిటైల్ ధరలు తగ్గలేదు.

ద్రవ్యోల్భణ పెరుగుదలకు దారితీసే ప్రమాదం
ఇంధన ధరలు, ప్రధానంగా డీజిల్ ధరలు పెరిగితే దీర్ఘకాలంలో ద్రవ్యోల్భణ పెరుగుదలకు దారితీసే ప్రమాదం ఉందని అంటున్నారు. పెట్రోల్ ధరలు పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి. ప్రధానంగా కరోనా కారణంగా డీలా పడిన డిమాండ్, క్రమంగా పుంజుకుంటోంది. చమురు ఉత్పత్తి దేశాలు ఉత్పత్తిలో కోత విధిస్తున్నాయి. దీంతో చమురు ధరలు అంతకంతకూ పెరిగి తిరిగి కరోనా పూర్వస్థాయికి చేరుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగినప్పుడు మన దేశంలోను ఆ ప్రభావం సహజం.

చమురు డిమాండ్ వెనుక
ప్రపంచవ్యాప్తంగా డిమాండ్, ఉత్పత్తి మందగించడం, చమురు ఉత్పత్తి దేశాల్లో అస్థిరత లేదా ఉత్పత్తి కోత వంటి అంశాలు చమురు ధరల పైన ప్రభావం చూపుతాయి. కరోనా నుండి క్రమంగా ప్రపంచ దేశాలు కోలుకుంటున్నాయి. ట్రాన్సుపోర్ట్, ఇండస్ట్రీ కార్యకలాపాలు పుంజుకున్నాయి. పారిశ్రామిక రంగం పుంజుకోవడంతో చమురు డిమాండ్ పెరుగుతోంది. అలాగే, వాహనాల సంఖ్య ఇటీవల పెరిగింది. ప్రయివేటు వాహనాల రాకపోకలు పెరిగాయి. దీంతో చమురుకు డిమాండ్ పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్కు రూ.88.14, డీజిల్ రూ.78.38, ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.94.64, డీజిల్ రూ.85.32, చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.90.44, డీజిల్ రూ.85.32, బెంగళూరులో పెట్రోల్ రూ.91.09, డీజిల్ రూ.83.09, కోల్ కతాలో పెట్రోల్ రూ 89.44, డీజిల్ ధర రూ .81.96గా ఉంది. ఇక, తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్లో పెట్రోల్ రూ.91.65, డీజిల్ రూ.85.50, అమరావతిలో పెట్రోల్ రూ.94.28, డీజిల్ రూ.87.62గా ఉంది.
More From GoodReturns

Iran war: కేవలం గ్యాస్ ఒక్కటే కాదు.. ఈ 5 రంగాలపై భారీ ఎఫెక్ట్ ఉండే అవకాశం?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications